News July 12, 2024
కాళేశ్వరంలో కొనసాగుతున్న రెండోదశ పరీక్షలు
భూపాలపల్లి జిల్లాలో కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన అన్నారం(సరస్వతి) బ్యారేజీలో పూణే సెంట్రల్ వాటర్ పవర్ రీసెర్చ్ స్టేషన్(CWPRS)కు చెందిన ముగ్గురు నిపుణుల బృందం జియోఫిజికల్ రెండో దశ పరీక్షలను ఇంజనీరింగ్ అధికారులతో కలసి ముమ్మరం చేసింది. గత ఏడాది నవంబర్లో బ్యారేజీలో సీపేజీ లీకేజీలు ఏర్పడిన నేపథ్యంలో పలుమార్లు NDSA, CWUC బృందాలు పర్యటించాయి. ప్రస్తుతం పరీక్షలు కొనసాగుతున్నాయి.
Similar News
News October 2, 2024
వరంగల్: మరికాసేపట్లో DSC సర్టిఫికెట్ వెరిఫికేషన్
వరంగల్ జిల్లాలో DSCలో SGT అభ్యర్థులు 1 :3నిష్పత్తిలో 435 మంది, SGT ఉర్దూలో 25 మంది సర్టిఫికెట్ వెరిఫికేషన్కు అర్హత సాధించారని డీఈఓ జ్ఞానేశ్వర్ తెలిపారు. బుధవారం ఉ.10 గంటల నుంచి సా. 5 గంటల వరకు GTలో 270 మంది, SGT ఉర్దూలో 25 మంది అభ్యర్థులు వెరిఫికేషన్కు రావాలన్నారు. ఒరిజినల్ సర్టిఫికెట్లతో, రెండు సెట్లు గెజిటెడ్ తప్పనిసరన్నారు. వివరాలకు www.deowarangal.net సంప్రదించాలన్నారు.
News October 2, 2024
గీసుగొండ: బాలికపై వృద్ధుడి అత్యాచారం
గీసుగొండలో దారుణం చోటు చేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. ఓ గ్రామానికి చెందిన 12ఏళ్ల బాలికపై సాంబయ్య (65) అత్యాచారానికి పాల్పడ్డాడు. బాలిక తండ్రి చనిపోగా అన్నదమ్ములతో కలిసి ఉంటోంది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో బాలికకు మాయమాటలు చెప్పి అత్యాచారం చేశాడు. ఈ విషయం తల్లికి చెప్పడంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. వైద్యులు పరీక్షించి 4నెలల గర్భవతిగా నిర్ధారించారు. సాంబయ్యపై పోక్సో చేసు నమోదైంది.
News October 2, 2024
WGL: నేడు ఎంగిలిపూల బతుకమ్మ
తెలంగాణ సంస్కృతికి అద్దం పట్టే ప్రకృతితో మమేకమయ్యే సంబరం బతుకమ్మ పండుగ. తొమ్మిది రోజులపాటు తొమ్మిది రకాల ప్రసాదాలను బతుకమ్మకు నివేదిస్తారు. బుధవారం ఎంగిలిపూల బతుకమ్మ అలంకరణ చేస్తారు. దీనికోసం రకరకాల పువ్వులు తీసుకొచ్చే బతుకమ్మగా పేరుస్తారు. ఈరోజు నువ్వులు, నూకలు లేదా బియ్యం, బెల్లంతో నైవేద్యం చేసి బతుకమ్మకు సమర్పిస్తారు.