News June 8, 2024
కాళేశ్వరం వాసులకే ఛైర్మన్ పదవి?
కాళేశ్వరం దేవస్థానానికి పాలక మండలి నియామకానికి సన్నాహాలు మొదలయ్యాయి. BRS ప్రభుత్వంలో నియామకమైన పాలకమండలి గడువు మార్చి 13న ముగిసింది. రెండేళ్ల క్రితం ఈ క్షేత్రానికి పూర్తిస్థాయి ఈవో నియామకం జరగగా.. 2 నెలల క్రితం బదిలీ అయ్యారు. అయితే పాలకమండలి ఏర్పాటు చేయాలని మంత్రి శ్రీధర్బాబు దృష్టికి స్థానిక నేతలు తీసుకెళ్లారు. ఈసారి కాళేశ్వరం వాసులకే ఛైర్మన్ పదవి దక్కాలని ఆశిస్తున్నట్లు సమాచారం.
Similar News
News October 3, 2024
జనసంద్రమైన వేయి స్తంభాల ఆలయ పరిసర ప్రాంతాలు
HNK జిల్లా కేంద్రంలో ఎంగిలిపూల బతుకమ్మ వేడుకల సందర్భంగా వేయి స్తంభాల ఆలయ పరిసర ప్రాంతాలు జనసంద్రమయ్యాయి. హనుమకొండ నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి మహిళలు అధిక సంఖ్యలో దేవాలయానికి తరలివచ్చి బతుకమ్మ ఆడుతూ సందడి చేశారు. బతుకమ్మ వేడుకల సందర్భంగా మహిళలు, భక్తులకు ఇబ్బందులు లేకుండా ప్రత్యేక ఏర్పాట్లను చేపట్టారు.
News October 3, 2024
ఉమ్మడి వరంగల్ జిల్లాలో క్రైమ్ న్యూస్
> BHPL: రంగయ్యపల్లిలో పిడుగు పడి మహిళా రైతు మృతి
> MHBD: గుట్టకింది తండాలో పిడుగు పడి ఒకరికి గాయాలు
> HNK: అక్రమంగా మద్యం అమ్ముతున్న వ్యక్తి అరెస్ట్
> KZP: సైబర్ నేరాల పట్ల అవగాహన సదస్సు
> HNK: పిడుగు పడి ఇద్దరు మృతి
> JN: కే-వీల్స్ దొంగతనం చేసిన వ్యక్తి అరెస్ట్
> MHBD: దొంగల ముఠాను పట్టుకున్న పోలీసులు
> HNK: మహిళతో సహా ముగ్గురు దోపిడీ దొంగల అరెస్ట్
> WGL: బాధితుడికి పోగొట్టుకున్న ఫోన్ అందజేత
News October 2, 2024
బతుకమ్మను ఎత్తుకున్న ఎంపీ కడియం కావ్య
హనుమకొండ జిల్లా కేంద్రంలోని పలు ప్రాంతాల్లో నిర్వహించిన బతుకమ్మ పండుగ వేడుకల్లో వరంగల్ ఎంపీ కడియం కావ్య పాల్గొన్నారు. బతుకమ్మను ఎంపీ కడియం కావ్య ఎత్తుకొని కాసేపు బతుకమ్మ ఆడి సందడి చేశారు. తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలకు బతుకమ్మ పండుగ ప్రతీక అని, బతుకమ్మ పండుగ వేడుకల్లో తొలిసారి ఎంపీగా పాల్గొనడం సంతోషంగా ఉందని చెప్పారు.