News February 9, 2025
కాళేశ్వర క్షేత్రం అభివృద్ధికి మాస్టర్ ప్లాన్..

ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కాళేశ్వరం ముక్తేశ్వర స్వామి ఆలయాన్ని అభివృద్ధి చేసేందుకు మాస్టర్ ప్లాన్ రూపొందించామని.. అందుకు తగ్గట్లుగా నిధులు మంజూరు చేస్తున్నట్లు మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. మహా కుంభాభిషేక కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం మంత్రి కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్, MLA గండ్ర సత్యనారాయణరావుతో కలిసి ఆయన మాట్లాడుతూ.. కాశీ, కేదార్నాథ్ కంటే ఈ క్షేత్రం ప్రాశస్త్యం కలదిగా పురాణాలు చెబుతున్నాయన్నారు.
Similar News
News November 4, 2025
ములుగు జిల్లా ధాన్యం కొనుగోలు కేంద్రాల వివరాలు

జిల్లాలో 184 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ దివాకర్ టి.ఎస్. ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కేంద్రాల్లో 1,318 టార్పాలిన్ కవర్లు, 56 తూర్పార యంత్రాలు, 87 తూకం యంత్రాలతో పాటు 1,28,750 గన్నీ సంచులు అందుబాటులో ఉంచామని వివరించారు. ఇప్పటివరకు ఆరుగురు రైతుల నుంచి ₹6,83,254 విలువ గల 28.600 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసినట్లు ఆయన పేర్కొన్నారు.
News November 4, 2025
TU: సత్ఫలితాలనిస్తున్న బయోమెట్రిక్ హాజరు

తెలంగాణ యూనివర్సీటీలో ఇటీవల పకడ్బందీగా చేపట్టిన బయోమెట్రిక్ హాజరు విధానం సత్ఫలితాలనిస్తోంది. ఉన్నత విద్యాశాఖ ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్న వర్సిటీ అధికారులు ఎవరినీ ఉపేక్షించడం లేదు. తప్పనిసరిగా ఉదయం, సాయంత్రం సమయానుసారంగా బయోమెట్రిక్ ఇవ్వాల్సిందేనని, నిబంధనలు పాటించని అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బంది జీతాల్లో కోతలు విధిస్తోంది. బయోమెట్రిక్ హాజరు లేని సిబ్బంది సాధారణ సెలవులను భారీగా కోత విధించింది.
News November 4, 2025
ADB: పత్తి రైతుకు మరో కష్టం

ఆరుగాలం కష్టపడి పండించిన పంటను ఓవైపు ప్రకృతి ముంచుతుంటే మరోవైపు కొనుగోళ్లలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఎకరానికి 7 క్వింటాళు కొనుగోలు చేయాలని సీసీఐ నిబంధన పత్తి రైతులకు కష్టంగా మారింది. గతంలో ఎకరానికి 12 క్వింటాళ్ల పత్తి కొనేవారు. ఎకరానికి 10 క్వింటాళ్ల వరకు దిగుబడి వస్తుంది. 7 క్వింటాళు కొంటే మిగతాది ఎక్కడ అమ్ముకోవాలని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఉమ్మడి ADBలో 8 లక్షల ఎకరాల్లో పత్తి సాగవుతోంది.


