News July 1, 2024

కాళ్లు కడిగి పింఛన్ అందించిన మంత్రి నిమ్మల

image

ఏపీ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పాలకొల్లు నియోజకవర్గంలో ఎన్టీఆర్ భరోసా పింఛన్లను సోమవారం లబ్ధిదారులకు అందజేశారు. ఈ క్రమంలో వృద్ధుల కాళ్లు కడిగి పింఛన్ అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల ప్రచారంలో ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం పింఛన్లు పంపిణీ చేశామని స్పష్టం చేశారు. ఇక ప్రతి నెల పెరిగిన పింఛన్ లబ్ధిదారుల ఇంటికి చేరుతుందన్నారు.

Similar News

News July 3, 2024

‘కల్కి’ బుజ్జి కారులో రఘురామ సందడి

image

కల్కి 2898 AD’ సినిమాలో ప్రభాస్‌ నడిపిన ప్రత్యేక కారును భీమవరం ఏవీజీ సినిమాస్‌ మల్టీప్లెక్స్‌లో ఆవరణలో మంగళవారం ప్రదర్శించారు. వీక్షకులు భారీగా తరలివచ్చి ఈ కారు ఎదుట సెల్ఫీలు తీసుకున్నారు. అలాగే ఈ కారులో ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు సందడి చేశారు. ఈ సందర్భంగా ఇటీవల విడుదలైన కల్కి చిత్రం ఘనవిజయం సాధించడంతో మూవీ టీంకు ఆయన ప్రత్యేకంగా అభినందనలు తెలియజేశారు.

News July 3, 2024

స్టడీ సెంటర్లకు దరఖాస్తు చేసుకోండి: అబ్రహం

image

ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక విద్యాపీఠం పదో తరగతి, ఇంటర్మీడియట్ కొత్త స్టడీ సెంటర్లకు దరఖాస్తు చేసుకోవాలని ఏలూరు జిల్లా విద్యాశాఖ అధికారి ఎన్.అబ్రహం తెలిపారు. దరఖాస్తు చేసుకోవడానికి apopenchool.ap.gov.in వెబ్‌సైట్ నందు అప్లికేషన్స్ పొందుపరిచామన్నారు. ఇప్పటికే పర్మిషన్ పొంది ఉన్న స్టడీ సెంటర్లలోనూ రెన్యువల్ చేసుకోవాలని ఆయన సూచించారు.

News July 2, 2024

డిప్యూటీ CM ఆదేశాలు.. భీమవరం యువతి ఆచూకీ లభ్యం

image

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాలతో విజయవాడ పోలీసులు యువతి మిస్సింగ్ కేసును ఛేదించారు. దాదాపు 9నెలల తరువాత యువతి ఆచూకీ లభ్యమైంది. భీమవరానికి చెందిన శివకుమారి తమ కుమార్తె కనిపించడం లేదని ఇటీవల డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కి ఫిర్యాదు చేయడంతో విజయవాడ పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. ఓ యువకుడితో జమ్మూలో ఉన్నట్లు గుర్తించి ఇద్దరినీ అదుపులోకి తీసుకుని విజయవాడకు తీసుకువస్తున్నారు.