News November 10, 2024
కావలికి శాప్ చైర్మన్ అనిమిని రవి నాయుడు రాక

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ ఛైర్మన్ అనిమిని రవి నాయుడు ఆదివారం కావలి పట్టణానికి విచ్చేస్తున్నారు. మధ్యాహ్నం 12 గంటల 30 నిమిషాలకు కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డితో కలిసి కావలి పట్టణంలోని మినీ స్టేడియాన్ని సందర్శిస్తారు. తదుపరి స్థానిక ప్రజల నుంచి సూచనలు స్వీకరిస్తారు. ఈ మేరకు ఎమ్మెల్యే కార్యాలయ సిబ్బంది శనివారం ఒక ప్రకటన ద్వారా పేర్కొన్నారు.
Similar News
News February 21, 2026
గౌతమ్.. నిన్ను ఎప్పటికీ మరచిపోలేను: జగన్

నెల్లూరు జిల్లాకు చెందిన మాజీ మంత్రి గౌతమ్ రెడ్డి వర్ధంతి నేడు. ఈనేపథ్యంలో ఆయనతో తనకు ఉన్న బంధాన్ని మాజీ సీఎం జగన్ గుర్తు చేసుకున్నారు. ‘డియర్ గౌతమ్.. మన స్నేహంతో కూడిన మధురమైన జ్ఞాపకాలను నేను ఎప్పటికీ మరిచిపోలేను. నువ్వు నాకు స్నేహితుడే కాదు సోదరుడివి. నువ్వు ఎప్పటికీ నా హృదయంలో నిలిచిపోతావు’ అంటూ జగన్ భావోద్వేగపూరిత ట్వీట్ చేశారు.
News February 21, 2026
నెల్లూరు: దశాబ్దాల కల’వరం’..!

డక్కిలి(M) ఆల్తూరుపాడు బ్యాలన్సింగ్ రిజర్వాయర్ ప్రాజెక్టు పూర్తయితే వెంకటగిరి, శ్రీకాళహస్తి, తిరుపతి పట్టణాలకు తాగు, సాగు నీటి కొరత నుంచి బయటపడవచ్చు. దశాబ్దాల కల కావడంతో అది తీరితే వారికి వరమే. ఈ ప్రాజెక్ట్ కింద సోమశిల- స్వర్ణముఖి లింక్ కెనాల్ను 56 KM మేరా చేపట్టాల్సి ఉండగా రూ. 733.778 కోట్లను పరిపాలన ఆమోదం కోసం పంపారు. అనుమతులు రాకపోవడంతో ప్రాజెక్ట్ పనులు నత్తనడకన సాగుతున్నాయి.
News February 21, 2026
నెల్లూరు జిల్లాలో 6 మోడల్ సౌర గ్రామాలుగా అభివృద్ధి

సౌర వెలుగులతో గ్రామాలు వెలిగిపోనున్నాయి. PM సూర్య ఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన సోలార్ పథకాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కలెక్టర్ హిమాన్షు శుక్లా శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా జిల్లాలోని లేగుంటపాడు, బిట్రగుంట, మహిమలూరు, కలివెలపాలెం, మనుబోలు, కాకుపల్లి వంటి 5 వేల మందికి పైగా జనాభా కలిగిన గ్రామాలను ఎన్నుకొన్నారు. ఉత్తమ ప్రదర్శన కనబర్చిన గ్రామాలకు రూ. కోటి కేంద్రం మంజూరు చేస్తుంది.


