News November 22, 2024

కావలిలో వ్యక్తి దారుణ హత్య !

image

కావలి సమీపంలోని జగనన్న లే ఔట్ లో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. మృతుడు ముసునూరుకు చెందిన ముప్పవరపు శాంతి కుమార్(35)గా పోలీసులు గుర్తించారు. ఓ యువతితో కలిసి జగనన్న లేఔట్‌కి వచ్చిన శాంతి కుమార్, యువతి వెళ్లిపోయిన కాసేపటికి వచ్చి చూసేసరికి మృతి చెందినట్లు స్థానిక మహిళ తెలిపారు. ఘటన స్థలానికి కావలి DSP శ్రీధర్, రూరల్ సీఐ రాజేశ్వరరావు చేరుకున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Similar News

News February 18, 2026

5,35,499 మంది పిల్లలకు ఆల్బెండజోల్ మాత్రల పంపిణీ: DMHO

image

జాతీయ నులిపురుగుల నిర్మూలన దినోత్సవం సందర్భంగా జిల్లాలోని అన్ని అంగన్వాడీ కేంద్రాలు, ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, కళాశాలల్లో 1-19 సం.లలోపు ఉన్న 5.75,806 పిల్లలలో 5,35,499 మందికి ఆల్బెండజోల్ మాత్రలు మింగించినట్లు DMHO డాక్టర్ వి.సుజాత తెలిపారు. మొత్తంగా 93% ప్రగతి సాధించినట్లు తెలిపారు. మిగిలిన వారికి ఈనెల 24వ తేదీన ఇవ్వనున్నట్లు ఆమె స్పష్టం చేశారు.

News February 18, 2026

కేంద్రీయ విద్యాలయంలో పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం

image

నెల్లూరు రూరల్‌లోని కేంద్రీయ విద్యాలయంలో కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్ ప్రాతిపదికన పలు పోస్టులకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపల్ దొరసానమ్మ ఒక ప్రకటనలో తెలిపారు. టీచర్, కార్యాలయ సిబ్బంది పోస్టులకు అర్హులైన వారు kothuru.kvs.ac.in లో దరఖాస్తు చేసుకోవాలని కోరారు. ఇంటర్వ్యూలను ఈ నెల 23, 24న తేదీల్లో నిర్వహించనున్నామని చెప్పారు.

News February 18, 2026

నెల్లూరు: ఇలా చేస్తే రూ.5వేలు!

image

నెల్లూరు జిల్లాలో మై భారత్ యువ వాలంటీర్ల నియామకానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా యువజన అధికారి ఆకుల మహేందర్ రెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. జిల్లాకు చెందిన 10 ఉత్తీర్ణులై 2025 ఏప్రిల్ ఒకటో తేదీకి 18 ఏళ్లు నిండి 29 ఏళ్లు లోపు వారు అర్హులన్నారు. రూ. 5వేలు గౌరవ వేతనం ఉంటుందన్నారు. ఈనెల 20వ తేదీ లోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు.