News September 12, 2025
కావలి: ఇంట్లోనే సమాధులు.. భయం లేకుండానే కాపురాలు

శ్మశాన వాటిక సమీపంలో ఉందంటేనే నివాసం ఉండేందుకు కూడా చాలా మంది భయపడుతుంటారు. కానీ కావలిలో మాత్రం సమాధులతోనే కొందరు సావాసం చేస్తున్నారు. గతంలో అక్కడి పెద్దలు శ్మశానానికి 70 ఎకరాల భూమిని కేటాయించారు. ఆ భూమి అన్యాక్రాంతం అయింది. సమాధులు ఆక్రమించుకుని మరీ ఇల్లును నిర్మించుకోవడంతో, ఇంటి ముందే సమాధులు దర్శనమిస్తున్నాయి. భయం లేకుండానే కాపురాలు చేస్తున్నారు.
Similar News
News September 12, 2025
మిస్టరీగా కావలి మాజీ MLA జాడ?

మాజీ MLA రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ఎక్కడ ఉన్నారన్నది కావలిలో ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. హత్యాయత్నం కేసులో ఇరుక్కున్న వెంటనే ప్రతాప్ రెడ్డి అజ్ఞాతంలోకి వెళ్లారు. బెంగళూరులో ఉండొచ్చని కొందరు.. కాదు కాదు ఆయన దేశం దాటి శ్రీలంక వెళ్లుంటారంటూ మరికొందరి ఊహాగానాలు షికారు చేస్తున్నాయి. అయితే ఆయన కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయని పోలీస్ వర్గాలు చెబుతున్నాయి. దాంతో ఆయన జాడ మిస్టరీగా మారింది.
News September 12, 2025
నెల్లూరు: మధ్యాహ్న భోజన పథకంపై పర్యవేక్షణ లోపం!

ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకంపై పర్యవేక్షణ లోపిస్తుంది. మెనూ ప్రకారం భోజనం పెట్టకపోవడంతో విద్యార్థులు తినడానికి ఇష్టపడటం లేదు. వరికుంటపాడు పాఠశాలలో తెల్లన్నం, ఆలుగడ్డ కూర పెట్టారు. కందుకూరులో నీటి సౌకర్యం లేక విద్యార్థులు ఇబ్బంది పడ్డారు. బోగోలు పాఠశాలలో కూర్చునే సౌకర్యం లేదు. గుడ్లూరులో మెనూ ప్రకారం వడ్డించినా విద్యార్థులు తినలేదు. అధికారులు పర్యవేక్షణ చేయాలని స్థానికులు కోరుతున్నారు.
News September 12, 2025
నెల్లూరు: పంచాయతీ భవానాలకు మోక్షం..

జిల్లాలో అద్దె, శిదీలావస్థకు చేరుకున్న పంచాయతీలకు శాశ్వత భవనాల నిర్మాణాలకు మోక్షం లభించింది. దీంతో జిల్లాలో తోలుత 40 చోట్ల భవనాల నిర్మాణాలకు నిధులు మంజూరవగా, ఒక్కోదానికి రూ. 32లక్షలు వెచ్చించనున్నారు. ఎన్ఆర్ఈజీఎస్, రాష్ట్రీయ గ్రామ స్వరాజ్ అభియాన్ కింద నిధులు కేటాయించనున్నారు.