News April 17, 2024
కావలి: ఐదుగురి మరణానికి కారణం అదే..!

నిన్న కావలి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. జలదంకి(M) చామదల SC కాలనీకి చెందిన శ్రీనివాసులు HYDలో పనిచేస్తున్నారు. శ్రీరాముల కళ్యాణం జరిపించడానికి సొంతూరికి వచ్చారు. భార్య వరమ్మ, సోదరి లక్ష్మమ్మ, ఆమె కోడలు నీలిమ, మనవడు నందు(2)తో కలిసి కారులో కావలికి బయలుదేరారు. జలదంకి మీదుగా దగ్గరైనా.. రోడ్డు గుంతలమయంగా ఉండటంతో బిట్రగుంట మీదుగా వచ్చారు. ఆగి ఉన్న లారీని ఢీకొట్టడంతో అందరూ చనిపోయారు.
Similar News
News December 21, 2025
నెల్లూరు TDPలో BCల హవా..!

పార్టీ ఏదైనా నెల్లూరు రాజకీయాల్లో రెడ్డి సామాజికవర్గ నేతలు కీలకంగా వ్యవహరిస్తుంటారు. TDP ట్రెండ్ మార్చి బీసీలకు ప్రాధాన్యమిస్తోంది. TDP జిల్లా అధ్యక్ష పదవికి పెళ్లకూరు శ్రీనివాసుల రెడ్డి, వేమిరెడ్డి పట్టాభిరామిరెడ్డి మరికొందరు గట్టిగా ప్రయత్నించారు. కానీ MLC బీద రవిచంద్రకు మూడోసారి ఈ పదవిని అప్పగించారు. నెల్లూరు ఇన్ఛార్జ్ మేయర్గా రూప్ కుమార్, రాజ్యసభ ఎంపీగా బీద మస్తాన్ రావు ఉన్న విషయం తెలిసిందే.
News December 21, 2025
TDP నెల్లూరు జిల్లా బాస్గా బీద రవిచంద్ర

అందరూ ఊహించినట్లే టీడీపీ నెల్లూరు జిల్లా అధ్యక్షుడిగా బీద రవిచంద్ర నియమితులయ్యారు. జిల్లా ప్రధాన కార్యదర్శిగా చేజర్లు వెంకటేశ్వర్లు రెడ్డికి అవకాశం ఇచ్చారు. జిల్లా అధ్యక్ష పదవికి పలువురు పోటీపడ్డారు. ఓ ఎమ్మెల్యే తన కుటుంబ సభ్యులకు అధ్యక్ష పదవి ఇప్పించేందుకు ప్రయత్నం చేశారు. మరికొందరు ద్వితీయ శ్రేణి నాయకులు సైతం పోటీపడగా.. బీదకే టీడీపీ అధిష్ఠానం అవకాశం దక్కింది.
News December 21, 2025
పెంచలకోనలో విశేష పూజలు

పెంచలకోన శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో శనివారం విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అభిషేకం, కళ్యాణోత్సవం, సహస్ర దీపాలంకరణ తదితర పూజా కార్యక్రమాలను నిర్వహించారు. చుట్టుపక్కల ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో విచ్చేశారు. స్వామి, అమ్మవార్లను దర్శించుకుని తీర్థప్రసాదాలను స్వీకరించారు.


