News February 1, 2026
కావలి: రైలు కిందపడి వ్యక్తి సూసైడ్

కావలి రైల్వే పోలీస్ స్టేషన్ పరిధిలోని ఉదయగిరి బ్రిడ్జి కింద రైలు కిందపడి వ్యక్తి మృతి చెందాడని రైల్వే పోలీసులు తెలిపారు. ఆదివారం తిరుపతి నుంచి సికింద్రాబాద్ వెళుతున్న వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలు కింద పడి జలదంకి మండలం అన్నవరం గ్రామానికి చెందిన కలిచేటి మాధవ (52) ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటనపై రైల్వే ఎస్సై వెంకట్రావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Similar News
News February 18, 2026
నెల్లూరు జిల్లా లాడ్జీల్లో తనిఖీలు

ఎస్పీ అజిత వేజెండ్ల ఆదేశాల మేరకు నెల్లూరు జిల్లా వ్యాప్తంగా పోలీసు అధికారులు మంగళవారం రాత్రి లాడ్జీలు, హోటల్స్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. రికార్డులను పరిశీలించారు. లాడ్జీల్లోని ప్రతీ గదిని క్షుణ్ణంగా చెకింగ్ చేశారు. రాత్రి వేళల్లో లాడ్జిల్లో బస చేసిన వ్యక్తులను ప్రశ్నించారు. వారి వివరాలను ఆరా తీశారు.
News February 18, 2026
నెల్లూరు జిల్లా లాడ్జీల్లో తనిఖీలు

ఎస్పీ అజిత వేజెండ్ల ఆదేశాల మేరకు నెల్లూరు జిల్లా వ్యాప్తంగా పోలీసు అధికారులు మంగళవారం రాత్రి లాడ్జీలు, హోటల్స్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. రికార్డులను పరిశీలించారు. లాడ్జీల్లోని ప్రతీ గదిని క్షుణ్ణంగా చెకింగ్ చేశారు. రాత్రి వేళల్లో లాడ్జిల్లో బస చేసిన వ్యక్తులను ప్రశ్నించారు. వారి వివరాలను ఆరా తీశారు.
News February 17, 2026
NGOS రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా కిరణ్ కుమార్

నెల్లూరు: ఏపీ NGOS రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా కిరణ్ కుమార్ ఎన్నికయ్యారు. ఆయనను నెల్లూరులోని ఎన్జీవో హోంలో జిల్లా అధ్యక్షుడు బండారుపల్లి వెంకటేశ్వర్లు ఆధ్వరంలో మంగళవారం సత్కరించారు. ట్రెజరీ అసోసియేషన్ నాయకుడు రమణారెడ్డి, ఎన్జీవోస్ జిల్లా కార్యవర్గ సభ్యులు నంది మండలం ఆంజనేయ వర్మ, లక్కాకుల పెంచలయ్య, గాదిరాజు రామకృష్ణ, రాజేంద్ర సురేష్, డీఈవో రాజేంద్ర, సతీశ్ పాల్గొన్నారు.


