News March 3, 2025
కాశీకి వెళ్లి మురిమడుగు మహిళా మృతి

ఉత్తరప్రదేశ్లోని కాశీ పుణ్యక్షేత్రం దర్శనానికి వెళ్లి జన్నారం మండలంలోని మురిమడుగు మహిళ బోర్లకుంట రాజవ్వ మృతి చెందింది. 11 రోజుల క్రితం రాజవ్వ కుంభమేళాలో భాగంగా కాశీకి వెళ్లి శివున్ని దర్శించుకుంది. అనంతరం రాజవ్వ హఠాత్తుగా పడిపోవడంతో ఆసుపత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందింది. దీంతో కుటుంబ సభ్యులు ఆదివారం మణికర్ణిక ఘాట్లో రాజవ్వ పార్థివ దేహానికి అంత్యక్రియలు చేశారు.
Similar News
News December 18, 2025
యాసంగిలో తగ్గిన ఉల్లి సాగు విస్తీర్ణం

TG: సరైన ధర, మార్కెటింగ్ సౌకర్యాలు లేకపోవడం, తగ్గిన దిగుబడి, పెరిగిపోతున్న సాగు ఖర్చు కారణంగా యాసంగిలో ఉల్లి సాగు విస్తీర్ణం తగ్గింది. ఈ ఏడాదిలో రబీలో కేవలం 5,200 ఎకరాల్లోనే ఉల్లిని సాగు చేస్తున్నారు. 12 జిల్లాల్లో ఒక్క ఎకరాలో కూడా ఉల్లి నాట్లు పడలేదు. గత ఏడాది కన్నా రబీ ఉల్లి సాగు విస్తీర్ణం సగానికి తగ్గింది. ఈ సీజన్లో అత్యధికంగా వనపర్తి జిల్లాలో 2,601 ఎకరాల్లో ఉల్లి పంటను సాగు చేస్తున్నారు.
News December 18, 2025
కలెక్టర్ల వినూత్న ఆలోచనలు… శభాష్ అన్న CM

AP: బెస్ట్ ప్రాక్టీసెస్ అమలుపై కలెక్టర్లను CM CBN మెచ్చుకున్నారు. అల్లూరిలో ‘యాస్పిరేషన్ ఇంజిన్’తో STUDENTS మంచి మార్కులు సాధిస్తున్నారు. మన్యంలో ‘ముస్తాబు’తో స్టూడెంట్స్లో శుభ్రత మెరుగైంది. ‘మార్పు’తో అక్రమ మద్య రహితంగా ఏలూరు(D) మారుతోంది. స్మార్ట్ కిచెన్లకు అగ్రి లింకప్తో కడప స్కూళ్లకు మంచి ఆహారం అందుతోంది. ATPలో రెవెన్యూ రికార్డుల డిజిటలైజేషన్, NLRలో అగ్రి యాంత్రీకరణతో మేలు జరుగుతోంది.
News December 18, 2025
జగిత్యాల: నూతన పాలకవర్గాలపై గంపెడాశలు

పల్లెలే దేశానికి పట్టు కొమ్మాలంటారు. అలాంటి పల్లెల్లో సర్పంచులు లేక దాదాపు 2 ఏళ్లు గడిచింది. దీంతో గ్రామాలు అభివృద్ధికి నోచుకోక కుంటుపడ్డాయి. ఇక తాజాగా జరిగిన ఎన్నికలతో పంచాయతీలకు నూతన పాలకవర్గాలు ఏర్పాటు కానుండగా, గెలిచినవారంతా ఈనెల 22న ప్రమాణ స్వీకారం చేసి బాధ్యతలు స్వీకరించనున్నారు. వారు ఏ మేరకు గ్రామాలను అభివృద్ధి పథంలో పరుగులు పెట్టిస్తారో వేచి చూడాలి మరి.


