News September 16, 2025
కిక్ బాక్సింగ్ పోటీల్లో సిరిసిల్ల విద్యార్థులకు వెండి పతకాలు

అస్మిత మహిళ కిక్ బాక్సింగ్ ఉమెన్స్ లీగ్లో రాజన్న సిరిసిల్ల జిల్లాకి చెందిన ఇద్దరు విద్యార్థులు రెండు వెండి పతకాలు సాధించారు. ఆదివారం వరంగల్ మున్సిపల్ ఇండోర్ స్టేడియంలో జరిగిన అస్మిత ఖేలో ఇండియా ఉమెన్స్ కిక్ బాక్సింగ్ లీగ్లో జిల్లాకు చెందిన నలుగురు విద్యార్థులు పాల్గొనగా ఓల్డర్ కెడిట్- 37kgs point fight విభాగంలో శ్లోక, 42kgs point fight విభాగంలో లక్ష్మిప్రసన్న వెండి పతకాలు కొల్లగొట్టారు.
Similar News
News September 16, 2025
భువనగిరి: వైద్యం వికటించి యువతి మృతి

వైద్యం వికటించి యువతి మృతి చెందిన ఘటన HYD నాచారం PS పరిధి స్నేహపురి కాలనీ సత్య లాప్రోస్కోపిక్ ఆస్పత్రిలో జరిగింది. బాధితుల వివరాలిలా.. యాదాద్రి (D) చళ్లూరుకు చెందిన శైలజ(22) కడుపు నొప్పితో వస్తే అపెండిక్స్ ఆపరేషన్ చేశారు. శస్త్రచికిత్స వికటించడంతో వేరే ఆస్పత్రికి తరలించాలని సూచించారని ఆరోపించారు. సికింద్రాబాద్లోని మరో ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయిందని ఆస్పత్రిముందు ఆందోళనకు దిగారు.
News September 16, 2025
అన్నమయ్య: సన్నిహితులే రాక్షసులు

మన చుట్టూ సన్నిహితంగా ఉండే వారే రాక్షసులుగా మారి బాలికల్ని చిదిమేస్తున్నారు. నిన్న అన్నమయ్య జిల్లాలోని <<17714750>>మదనపల్లె<<>>, <<17720487>>తంబళ్లపల్లె<<>>లో జరిగిన 2 అత్యాచార ఘటనలు బాలికలపై ఉన్న భద్రతను ప్రశ్నిస్తున్నాయి. ఎవర్ని నమ్మాలి? ఎవర్ని నమ్మకూడదనే భయాన్ని తల్లిదండ్రుల్లో కలిగిస్తున్నాయి. ఇలాంటి నరరూప రాక్షసులను కఠినంగా శిక్షించాలనే డిమాండ్ సర్వత్రా వినిపిస్తోంది.
News September 16, 2025
వనపర్తి: నిరుద్యోగులకు జాబ్ మేళా

నిరుద్యోగ యువతకు హైదరాబాద్లోని వివిధ కంపెనీలలో శిక్షణ, ఉపాధి కల్పించేందుకు జిల్లా ఉపాధి కల్పన శాఖ ఆధ్వర్యంలో ప్రధానమంత్రి కౌశల్ కేంద్ర సహకారంతో సెప్టెంబర్ 18న జాబ్ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఎంప్లాయిమెంట్ అధికారి వెంకటేశ్వర్ల రాజు తెలిపారు. 18 నుంచి 35 సంవత్సరాలు వయసు కలిగి ఉండాలన్నారు. SSC, ITI, DEGREE అర్హతలన్నారు.