News April 14, 2025
కియాలో ఇంజిన్ల చోరీ.. దర్యాప్తు ముమ్మరం!

పెనుకొండ సమీపంలోని కియా పరిశ్రమలో 900 కారు ఇంజిన్లు చోరీకి గురైన విషయం తెలిందే. ఈ ఘటనలో అధికారులు దర్యాప్తును ముమ్మరం చేశారు. ఇక్కడ పనిచేసిన మాజీ ఉద్యోగులను విచారిస్తున్నారు. పెనుకొండ సీఐ రాఘవన్ తన బృందంతో తమిళనాడుకు వెళ్లి పలువురి ఆచూకీ కోసం గాలిస్తున్నారు. త్వరలోనే ఈ కేసు కొలిక్కి వచ్చే అవకాశముంది. కాగా 2020 నుంచి ఈ చోరీలు జరుగుతున్నట్టు ప్రాథమికంగా గుర్తించారు.
Similar News
News November 1, 2025
అమరావతి రైల్వే లైన్ నిర్మాణానికి భూసేకరణ.. ఎక్కడెక్కడంటే.!

అమరావతి రైల్వే లైన్ నిర్మాణం కోసం ఎర్రుపాలెం-నంబూరు మధ్య 56 కి.మీ మేర భూసేకరణ పూర్తవుతోంది. నందిగామ, జగ్గయ్యపేట, VJA మీదుగా వెళ్లే ఈ మార్గానికి ఇప్పటికే 260 ఎకరాల వరకు ల్యాండ్ అక్విజైషన్ పూర్తయింది. ఇందులో నందిగామ, జగ్గయ్యపేటలలోనే సుమారు 250 ఎకరాలు ఉన్నాయి. అమరావతిలో 8 ప్లాట్ఫామ్లతో కోచింగ్ టెర్మినల్, VJA రద్దీని తగ్గించేందుకు గన్నవరం స్టేషన్లో టెర్మినల్ ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి.
News November 1, 2025
HYD: ‘రంగనాథ్ సార్.. పాఠశాలకు వెళ్లలేకపోతున్నాం’

HYD శంషాబాద్ మండలం చిన్నగోల్కొండ, పెద్ద గోల్కొండ ఔటర్ రింగురోడ్డు అండర్ పాస్లు వరద నీటిలో మునుగుతున్నాయని విద్యార్థినులు హైడ్రా కమిషనర్ రంగనాథ్కు ఫిర్యాదు చేశారు. ఆర్టీసీ బస్సులో తాము స్కూల్కు వెళ్తామని.. ఇటీవల తాము ప్రయాణిస్తున్న బస్సు అండర్పాస్ కింద నీటిలో ఆగిపోవడంతో ఇబ్బంది పడ్డామని ఫిర్యాదులో పేర్కొన్నారు. సమస్యను వెంటనే పరిష్కరించాలని కోరారు.
News November 1, 2025
HYD: ‘రంగనాథ్ సార్.. పాఠశాలకు వెళ్లలేకపోతున్నాం’

HYD శంషాబాద్ మండలం చిన్నగోల్కొండ, పెద్ద గోల్కొండ ఔటర్ రింగురోడ్డు అండర్ పాస్లు వరద నీటిలో మునుగుతున్నాయని విద్యార్థినులు హైడ్రా కమిషనర్ రంగనాథ్కు ఫిర్యాదు చేశారు. ఆర్టీసీ బస్సులో తాము స్కూల్కు వెళ్తామని.. ఇటీవల తాము ప్రయాణిస్తున్న బస్సు అండర్పాస్ కింద నీటిలో ఆగిపోవడంతో ఇబ్బంది పడ్డామని ఫిర్యాదులో పేర్కొన్నారు. సమస్యను వెంటనే పరిష్కరించాలని కోరారు.


