News April 2, 2024
కిరణ్ కుమార్ రెడ్డి 4లక్షల మెజార్టీతో గెలుస్తాడు:రాజగోపాల్ రెడ్డి

భువనగిరి పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి 4లక్షల మెజార్టీతో గెలవబోతున్నారని మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి అన్నారు. నల్లగొండ, భువనగిరి స్థానాలను కాంగ్రెస్ కైవసం చేసుకుంటుందని తెలిపారు. చౌటుప్పల్, సంస్థాన్ నారాయణపూర్ మండలాల్లో వివిధ కార్యక్రమాల్లో ఆయన పాల్గొని మాట్లాడారు. బూర నర్సయ్య గౌడ్ కోమటిరెడ్డి బ్రదర్స్ పై అనవసరంగా నోరు పారేసుకుంటున్నారన్నారు.
Similar News
News July 8, 2025
NLG: జీపీ వర్కర్లకు మూడు నెలల జీతాలు విడుదల

గ్రామపంచాయతీల్లో పనిచేస్తున్న మల్టీపర్పస్ వర్కర్లకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త తెలిపింది. ఏప్రిల్, మే, జూన్ మాసాల వేతనాలుగా రూ.150 కోట్లు విడుదల చేసింది. ఒకటి రెండు రోజుల్లో జీతాలు వారి ఖాతాల్లోకి జమయ్యే అవకాశం ఉంది. నల్గొండ జిల్లాలోని 868 గ్రామపంచాయతీల్లో పనిచేస్తున్న 3,500 మందికి పైగా పారిశుద్ధ్య కార్మికులకు లబ్ధి చేకూరనుంది.
News July 8, 2025
NLG: రైతులకు యూరియా కష్టాలు ఇంకెన్నాళ్లు!?

నల్గొండ జిల్లాలోని రైతులకు మళ్లీ యూరియా కష్టాలు మొదలయ్యాయి. సకాలంలో యూరియా అందక రైతులు అవస్థలు పడుతున్నారు. వారం రోజులుగా జిల్లాలోని ప్రైవేట్ ఫర్టిలైజర్ డీలర్లు యూరియాను విక్రయించకపోవడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. సొసైటీలకు వచ్చిన యూరియా గంటల వ్యవధిలోనే అయిపోతుంది. ప్రైవేట్ డీలర్లు యూరియా అమ్మితే తమకు ఇబ్బందులు ఉండవని రైతులు పేర్కొంటున్నారు.
News July 8, 2025
నల్గొండ: నిరుద్యోగ యువకులకు హౌస్ వైరింగ్లో ఉచిత శిక్షణ

నల్గొండ శివారులోని SBI గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణా సంస్థలో గ్రామీణ నిరుద్యోగ యువకులకు హౌస్ వైరింగ్ (ఎలక్ట్రీషియన్) లో 31 రోజుల ఉచిత శిక్షణ అందిస్తున్నామని సంస్థ సంచాలకులు రఘుపతి తెలిపారు. శిక్షణ కాలంలో ఉచిత వసతి, భోజనం ఉంటుందన్నారు. 18 నుంచి 45 సం. లోపు ఉన్న వారు అర్హులని అన్నారు. ఆసక్తి గలవారు జూలై 9 లోపు సంస్థ ఆఫీసులో దరఖాస్తు చేసుకోవాలన్నారు.