News February 25, 2025
కీసరగుట్టపై నేటి కార్యక్రమాలు

కీసరగుట్ట శ్రీ భవాని శివదుర్గా సమేత రామలింగేశ్వర స్వామి ఆలయంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు నిన్నటి నుంచి ప్రారంభం అయ్యాయి. 2వ రోజు మంగళవారం కార్యక్రమాలు: ఉదయం 9:00 గంటలకు రుద్రస్వాహాకార హోమం, సాయంత్రం 4:00 గంటలకు జ్వాలార్చన, రాత్రి 7:00 గంటలకు ప్రదోషకాల పూజ, రాత్రి 8:00 గంటలకు శ్రీ రామలింగేశ్వర స్వామి కీసర నుంచి కీసర గుట్టకు బయలుదేరుతారు. రాత్రి10:00 గంటలకు స్వామి వారి కళ్యాణం వైభవంగా జరగనుంది.
Similar News
News February 26, 2026
SRCL: ‘పదో తరగతి కీలకం.. ఒత్తిడి వీడాలి’

పదో తరగతి విద్యార్థుల జీవితంలో ఈ దశ అత్యంత కీలకమని, పట్టుదలతో చదివి మంచి ఫలితాలు సాధించాలని జిల్లా కలెక్టర్ గరిమా అగ్రవాల్ సూచించారు. గురువారం ఎల్లారెడ్డిపేట మండలం బొప్పాపూర్ ఉన్నత పాఠశాలను సందర్శించిన ఆమె, పదో తరగతి గదికి వెళ్లి విద్యార్థులతో ముచ్చటించారు. అన్ని సబ్జెక్టులపై పట్టు సాధించాలని, ప్రశ్నలకు సమాధానాలు రాసిన తర్వాత మరోసారి సరిచూసుకోవాలని సూచించారు.
News February 26, 2026
శ్రీకాకుళం: పొన్నాడ వంతెన వద్ద వ్యక్తి దారుణ హత్య?

శ్రీకాకుళం వాంబే కాలనీకి చెందిన పైల మోహన్ రావు (40) పొన్నాడ వంతెన సమీపంలో గురువారం శవమై కనిపించారు. గత రెండు రోజులుగా ఆచూకీ లేని మోహన్రావు కోసం కుటుంబ సభ్యులు గాలిస్తుండగా, రక్తపు మడుగులో విగతజీవిగా పడి ఉన్నాడు. మృతుని తలపై తీవ్ర గాయాలు ఉండటంతో ఎవరో గుర్తుతెలియని వ్యక్తులు దారుణంగా హత్య చేసినట్లు అనుమానిస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
News February 26, 2026
రుషికొండ: ప్రమాదవశాత్తు సముద్రంలో పడి యువకుడి మృతి

రుషికొండ సమీపాన బేపార్క్ వద్ద ప్రమాదవశాత్తు సముద్రంలో పడి ఓ యువకుడు మృతి చెందాడు. ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి చెందిన స్వప్నిల్ చౌహాన్ (25) స్నేహితులతో కలిసి విశాఖ వచ్చాడు. గురువారం మధ్యాహ్నం బీచ్ వద్ద ఫొటోలు దిగుతున్న సమయంలో ప్రమాదవశాత్తు కాలుజారి సముద్రంలో పడిపోయినట్లు స్నేహితులు తెలిపారు. ఆరిలోవ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.


