News February 26, 2025
కీసరలో రోడ్డు ప్రమాదం.. అన్నదమ్ములు మృతి

కీసర PS పరిధిలోని యాదగిరిపల్లిలో ORR సర్వీస్ రోడ్ మీద ప్రమాదం జరిగింది. పోలీసుల వివరాలు.. గూడూరు చంద్రశేఖర్ (32), మత్స్యగిరి (27) అన్నదమ్ములు. శ్రీను అనే మరో వ్యక్తితో బైక్పై బంధువుల ఇంటికి వెళ్లారు. తిరిగి వస్తుండగా ORR సర్వీస్ రోడ్లో ఎదురుగా వస్తున్న కారు ఢీ కొట్టింది. చంద్రశేఖర్ అక్కడిక్కడే చనిపోయాడు. మత్స్యగిరి చికిత్స పొందుతూ మృతి చెందాడు. కాగా, మార్చి 20న మత్స్యగిరి వివాహం జరగాల్సి ఉంది.
Similar News
News February 26, 2025
CT: వ్యక్తిగత స్కోరులో జద్రాన్ రికార్డు

ఛాంపియన్స్ ట్రోఫీలో అఫ్గాన్ బ్యాటర్ ఇబ్రహీం జద్రాన్ అదిరిపోయే ఇన్నింగ్స్తో దుమ్ములేపారు. 146 బంతుల్లోనే 12 ఫోర్లు, 6 సిక్సర్లతో 177 పరుగులు చేశారు. దీంతో CTలో అత్యధిక వ్యక్తిగత స్కోర్ చేసిన బ్యాటర్గా జద్రాన్ రికార్డు సృష్టించారు. ఇప్పటివరకూ ఈ రికార్డు ఇంగ్లండ్ ఓపెనర్ బెన్ డకెట్పై ఉండేది. డకెట్ తర్వాత నాథన్ ఆస్టిల్ (145*), ఆండీ ఫ్లవర్ (145), గంగూలీ (141) ఉన్నారు.
News February 26, 2025
BREAKING: పరీక్షల షెడ్యూల్ వచ్చేసింది

CUET-PG-2025 పరీక్షల షెడ్యూల్ను UGC విడుదల చేసింది. మార్చి 13 నుంచి ఏప్రిల్ 1 వరకు CBT విధానంలో పరీక్షలు జరుగుతాయని తెలిపింది. 43 షిఫ్టుల్లో 90 నిమిషాల చొప్పున పరీక్షలు జరుగుతాయని వెల్లడించింది. మొత్తం 157 సబ్జెక్టులకు సంబంధించి 4.12 లక్షల మంది పరీక్షలకు హాజరవుతారని పేర్కొంది. పరీక్షల షెడ్యూల్ కోసం ఇక్కడ <
News February 26, 2025
విశాఖలో రేపు పాఠశాలలకు సెలవు

ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో విశాఖలో అన్ని ప్రైవేట్, ప్రభుత్వ పాఠశాలలకు సెలవు ప్రకటించినట్లు డీఈవో ప్రేమ్ కుమార్ తెలిపారు. జిల్లా కలెక్టర్ హరేంధిర ప్రసాద్ సూచనల మేరకు సెలవు ఇచ్చినట్లు పేర్కొన్నారు. అన్ని పాఠశాలల యాజమాన్యాలు విధిగా నిబంధనలు పాటించాలని సూచించారు. ఈ మేరకు బుధవారం ఆదేశాలు జారీ చేశారు.