News February 9, 2025
కుంటాల గ్రామంలో సగానికి పైనే అమ్మవారి పేర్లు
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739003835411_50048514-normal-WIFI.webp)
కుంటాలలో సుమారు నాలుగువేల పైచిలుకు జనాభా ఉంది. తమ కోరికలు తీరుతుండటంతో ఊరిలో సగం మంది తమ పిల్లలకు అమ్మవారి పేరు పెట్టుకుంటున్నారు. ఇంట్లో పాప జన్మిస్తే గజ్జలమ్మ, గజ్జవ్వ బాబు జన్మిస్తే గజ్జయ్య, గజేందర్ గజ్జరామ్ అని నామకరణం చేస్తారు. కాగా సంతానం కలగకపోయినా ఆర్థిక ఇబ్బందులు ఉన్న, వ్యాపారంలో కలిసి రాకపోయినా, వ్యవసాయంలో నష్టాలు వచ్చిన, గజ్జలమ్మ దేవికి మొక్కుకుంటే ఆ కోరికలు తీరుతుందని భక్తుల నమ్మకం.
Similar News
News February 9, 2025
క్రికెట్ టోర్నమెంట్లో సూర్యాపేట స్ట్రైకర్స్ విజయం
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739026058248_51869405-normal-WIFI.webp)
ఎస్బీఐ ఇంట్రారీజియన్ ఆధ్వర్యంలో సూర్యాపేటలో నిర్వహిస్తున్న క్రికెట్ టోర్నమెంట్ను ఎస్బీఐ రీజినల్ మేనేజర్ వై. ఉపేంద్ర భాస్కర్ శనివారం ప్రారంభించారు. ఫైనల్ మ్యాచ్లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న బ్యాంకింగ్ బ్లాస్టర్స్ 100 పరుగులు చేయగా, సూర్యాపేట స్ట్రైకర్స్ బ్యాట్స్మెన్ ఏఎన్ఆర్ చివరి మూడు బంతుల్లో 13 పరుగులు చేసి 101 పరుగులతో సూర్యాపేట స్ట్రైకర్స్ జట్టును విజేతగా నిలిపారు.
News February 9, 2025
అరకు: మన్యం బంద్కు సీపీఎం మద్దతు
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739025790328_51959734-normal-WIFI.webp)
మన్యం బంద్ ఫిబ్రవరి 11, 12 తేదిల్లో జరుగనున్నది. దానికి సీపీఎం సంపూర్ణ మద్దతు ఇస్తుందని అరకులోయ సీపీఎం మండల కార్యదర్శి రామారావు తెలిపారు. ఈ మేరకు ఆయన మన్యం బంద్ జయప్రదం చేయాలని ఆదివాసి గిరిజన సంఘం అఖిలపక్ష ప్రజాసంఘాలు ఆధ్వర్యంలో ముద్రించిన కరపత్రాలు విస్తృతంగా పంచారు. ఆదివాసిల 1/70 చట్టాన్ని సవరించాలని రాష్ట్ర స్పీకర్ అయ్యన్న పాత్రుడు వ్యాఖ్యలను ఖండిస్తున్నామన్నారు.
News February 9, 2025
భువనగిరి: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739035624946_52242460-normal-WIFI.webp)
భువనగిరి మండలం మన్నెవారిపంపుకు చెందిన గుండ్ల ఎల్లారెడ్డి స్కూటీపై వెళ్తుండగా వెనుక నుంచి బస్సు ఢీకొట్టడంతో గాయాలైన విషయం తెలిసిందే. క్షతగాత్రుడిని భువనగిరి ప్రభుత్వ ఆసుపత్రి నుంచి మెరుగైన చికిత్స కోసం గాంధీ ఆసుపత్రికి తరలించగా వృద్ధుడు అప్పటికే మృతి చెందినట్లుగా వైద్యులు నిర్ధారించారు. మృతుడి కుటుంబీకుల అంగీకారంతో మృతుడి కళ్లను దానం చేశారు.