News January 31, 2025

కుంభమేళాకు కాజీపేట మీదుగా ప్రత్యేక రైళ్లు

image

ప్రయాగరాజ్ కుంభమేళా ప్రయాణికులను దృష్టిలో ఉంచుకుని కాజీపేట జంక్షన్ మీదుగా 4 ప్రత్యేక రైళ్లు నడిపిస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు. ఫిబ్రవరి 15న మౌలాలి- గయా (07089) ఎక్స్‌ప్రెస్ 19.43 గంటలకు, 18న వికారాబాద్- గయా (07091) ఎక్స్ ప్రెస్ 19.43 గంటలకు, 18న మౌలాలి- బనారస్ (07087) ఎక్స్‌ప్రెస్ 02.08 గంటలకు, 22న మౌలాలి- అజాంఘర్ (07707) 02.08 గంటలకు కాజీపేటకు చేరుకుంటాయని తెలిపారు.

Similar News

News July 6, 2025

సామర్లకోట: యువకుడి హత్య.. నిందితుల అరెస్ట్

image

సామర్లకోట మండలంలో ఇటీవల చోటుచేసుకున్న యువకుడి హత్య కేసులో నిందితులను అరెస్ట్ చేసి న్యాయస్థానానికి అప్పగించినట్లు సీఐ కృష్ణ భగవాన్ శనివారం తెలిపారు. తొలుత మిస్సింగ్ కేసుగా నమోదు చేశామని, దర్యాప్తులో హత్యగా తేలిందని ఆయన వెల్లడించారు. నిందితులపై సెక్షన్ 103(1), 238(a) r/w 3(5) బీఎంఎస్ కింద కేసులు నమోదు చేశామని, దర్యాప్తు కొనసాగుతుందని సీఐ పేర్కొన్నారు.

News July 6, 2025

శంషాబాద్: రేపు పోస్ట్ ఆఫీస్ సేవలు నిలిపివేత

image

పోస్ట్ ఆఫీస్ సేవలను సోమవారం నిలిపివేస్తున్నట్లు సౌత్ ఈస్ట్ డివిజన్ సీనియర్ సూపరింటెండెంట్ హైమావతి తెలిపారు. వినియోగదారులకు మరింత వేగవంతమైన, సమర్థవంతమైన సేవలు అందించేందుకు తపాలా శాఖ పోస్టల్ టెక్నాలజీ ఐటీ 2.0ను ప్రవేశ పెడుతుంది. ఈనెల 8 నుంచి ఈ సేవలు అందుబాటులోకి వస్తాయని, ఇందులో భాగంగా రేపు పోస్టాఫీసుల్లో ఎలాంటి లావాదేవీలు జరగవని పేర్కొన్నారు.

News July 6, 2025

అనకాపల్లి: నేడు ఉచితంగా రేబిస్ వ్యాక్సినేషన్

image

ప్రపంచ జూనోసిస్ దినోత్సవం సందర్భాన్ని పురస్కరించుకొని పెంపుడు కుక్కలకు ఉచితంగా రేబిస్ వ్యాక్సిన్ వేయనున్నట్లు ఆయన జిల్లా పశువైద్యాధికారి రామ్మోహన్ రావు శనివారం తెలిపారు. అనకాపల్లి గాంధీ ఆసుపత్రిలో మాట్లాడుతూ.. స్థానిక జిల్లా ఆసుపత్రితో పాటు అన్ని మండలాల్లో గల పశువైద్య కేంద్రాల్లో రేబిస్ వ్యాక్సిన్ వేస్తారని పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు.