News February 9, 2025
కుంభాభిషేకం విజయవంతం పట్ల హర్షం వ్యక్తం చేసిన BHPL కలెక్టర్

కాళేశ్వర దేవస్థానంలో మూడు రోజులపాటు ఘనంగా నిర్వహించిన మహా కుంభాభిషేక కార్యక్రమాలు విజయవంతంగా నిర్వహించడం పట్ల జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ హర్షం వ్యక్తం చేశారు. ఈ మహోత్సవాల్లో భాగస్వాములైన అన్ని శాఖల జిల్లా అధికారులను, సిబ్బందిని, మహోత్సవానికి విస్తృత ప్రచారం కల్పించిన పాత్రికేయులకు, జిల్లా యంత్రాంగం సలహాలు, సూచనలు పాటిస్తూ సహకరించిన భక్తులకు జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ అభినందించారు.
Similar News
News November 10, 2025
ఘట్కేసర్: అందెశ్రీ అంత్యక్రియల ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్

తెలంగాణ రాష్ట్ర గీతం జయ జయహే తెలంగాణ రచయిత అందెశ్రీ అంత్యక్రియలను రాష్ట్ర ప్రభుత్వం లాంఛనంగా నిర్వహించనున్నందున ఘట్కేసర్లోని ఎంఎల్ఏ క్యాంపు ఆఫీస్ పక్కన అంత్యక్రియలు నిర్వహించేందుకు ఏర్పాట్లను మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ పర్యవేక్షించారు. అందెశ్రీ అంత్యక్రియలకు అవసరమైన అన్ని ఏర్పాట్లు అన్నీ శాఖలు సమన్వయంతో పూర్తి చేయాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు.
News November 10, 2025
ఘట్కేసర్: అందెశ్రీ అంత్యక్రియల ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్

తెలంగాణ రాష్ట్ర గీతం జయ జయహే తెలంగాణ రచయిత అందెశ్రీ అంత్యక్రియలను రాష్ట్ర ప్రభుత్వం లాంఛనంగా నిర్వహించనున్నందున ఘట్కేసర్లోని ఎంఎల్ఏ క్యాంపు ఆఫీస్ పక్కన అంత్యక్రియలు నిర్వహించేందుకు ఏర్పాట్లను మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ పర్యవేక్షించారు. అందెశ్రీ అంత్యక్రియలకు అవసరమైన అన్ని ఏర్పాట్లు అన్నీ శాఖలు సమన్వయంతో పూర్తి చేయాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు.
News November 10, 2025
ఢిల్లీ పేలుడు.. విచారణకు ఆదేశించిన హోంమంత్రి

ఢిల్లీ పేలుడుపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆరా తీశారు. ఇంటెలిజెన్స్ బ్యూరో చీఫ్, ఢిల్లీ సీపీతో మాట్లాడి వివరాలు తీసుకున్నారు. ఈ ఘటనపై విచారణకు ఆదేశించారు. ఇప్పటికే NSG, NIA టీమ్స్ ఘటనాస్థలికి చేరుకున్నాయి. అటు పేలుడులో 8 మంది మరణించగా, 24 మందికి తీవ్రగాయాలయ్యాయి. కార్లు, దుకాణాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. ఎర్రకోట వద్ద భీతావహ వాతావరణం నెలకొంది.


