News February 21, 2025
కుంభాభిషేక కార్యక్రమానికి కేసీఆర్కు ఆహ్వానం

యాదగిరిగుట్ట స్వర్ణ విమాన గోపుర మహా కుంభాభిషేక కార్యక్రమానికి రావాల్సిందిగా ఆలయ పూజారులు శుక్రవారం మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కు ఆహ్వాన పత్రికను అందజేశారు. ఈనెల 23న మహా కుంభాభిషేక కార్యక్రమం జరుగుతుందని కార్యక్రమానికి హాజరుకావాలని కోరారు.
Similar News
News February 22, 2025
విపక్షాల ట్రాప్లో పడొద్దు: భట్టి

TG: కులగణనలో వివరాలు ఇవ్వని వారి కోసం ప్రభుత్వం మరో అవకాశాన్ని ఇచ్చిందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. దీనిపై కుట్రలో భాగంగానే విపక్షాలు విమర్శలు చేస్తున్నాయని దుయ్యబట్టారు. విపక్షాల ట్రాప్లో పడొద్దని ప్రజలకు సూచించారు. పారదర్శకతతో తాము ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు పేర్కొన్నారు. ప్రజలకు మేలు చేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు.
News February 22, 2025
సిరిమాను చెట్టును ఊరేగించేందుకు ఏర్పాట్లు

శ్రీ శ్యామలాంబ అమ్మవారి సిరిమాను చెట్టును అల్లువీధి చేర్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఆదివారం ఉదయం 9 గంటలకు 30 జతల ఎద్దులతో ప్రభుత్వ జూనియర్ కాలేజ్ దగ్గర నుంచి శ్రీ శ్యామలాంబ అమ్మవారి గుడి మీదుగా శివాజీ సెంటర్, బోసు బొమ్మ జంక్షన్, డబ్బివీధి, కోట జంక్షన్, NTR బొమ్మ జంక్షన్, మెయిన్ రోడ్డు మీదుగా అల్లు వీధికి చేర్చనున్నారు. ఈ సందర్భంగా కోలాటం, తప్పెటగుళ్ల ప్రదర్శన ఉంటుందని కమిటీ తెలిపింది.
News February 22, 2025
మహా కుంభాభిషేకానికి కేసీఆర్కు ఆహ్వానం

రేపు యాదగిరిగుట్ట స్వర్ణ విమాన గోపుర మహా కుంభాభిషేకానికి రావాలని మాజీ సీఎం కేసీఆర్ను ఆలయ పూజారులు కలిసి ఆహ్వానం అందించారు. అలాగే మార్చి 1 నుంచి 11 వరకు జరిగే బ్రహ్మోత్సవాల్లో పాల్గొనాలని కోరారు. ఆలయ ప్రధాన అర్చకులు వెంకటేశ్వరాచార్యులు, డీఈవో భాస్కర్, ముఖ్య అర్చకులు తదితరులు ఉన్నారు. కాగా, గతంలో పలు కార్యక్రమాలకు ఆహ్వానించినా కేసీఆర్ హాజరు కాలేదు. ఇప్పుడైనా వెళ్తారా అనేది చూడాలి.