News November 26, 2025
కుకుంబర్ మొజాయిక్ వైరస్తో మిరప పంటకు ముప్పు

కుకుంబర్ మొజాయిక్ వైరస్ సోకిన మిరప మొక్కలు గిడసబారి కనిపిస్తాయి. ఎదుగుదల లోపిస్తుంది. ఆకుల్లో పత్రహరితం కోల్పోవడంతో పాటు ఆకులు ఆకారం మారిపోయి, కొనలు సాగి కనిపిస్తాయి. ఈ వైరస్ బారినపడిన మొక్కల్లో పూత, కాపు ఉండదు. ఈ వైరస్ నివారణకు లీటరు నీటికి ఎసిఫేట్ 1.5 గ్రాములు లేదా థయోమిథాక్సామ్ 0.2 గ్రాములు లేదా ఇమిడాక్లోప్రిడ్ 0.3ml లేదా అసిటామిప్రిడ్ 0.2 గ్రాముల్లో ఒక దానిని కలిపి పిచికారీ చేయాలి.
Similar News
News November 26, 2025
HOCLలో 72 పోస్టులు.. అప్లై చేశారా?

కేరళలోని హిందుస్థాన్ ఆర్గానిక్ కెమికల్ లిమిటెడ్(<
News November 26, 2025
SBI సరికొత్త రికార్డు.. షేర్ వాల్యూ@రూ.999

దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు SBI సరికొత్త రికార్డు నమోదుచేసింది. ఇవాళ సంస్థ స్టాక్ దాదాపు 3 శాతం పెరగడంతో విలువ ఆల్టైమ్ హై రూ.999కి చేరింది. స్టాక్ మార్కెట్లు ముగిసే సమయానికి రూ.1000 కూడా దాటొచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. కాగా సంస్థ వ్యాపార విలువ రూ.100 లక్షల కోట్లకు చేరినట్లు ఛైర్మన్ చల్లా శ్రీనివాసులు ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే.
News November 26, 2025
‘కమ్లా పసంద్’ ఓనర్ కోడలు ఆత్మహత్య

పాపులర్ పాన్ మసాలా కంపెనీ ‘కమ్లా పసంద్’ ఓనర్ కమల్ కిషోర్ కోడలు దీప్తి చౌరాసియా(40) ఆత్మహత్య చేసుకున్నారు. ఢిల్లీ వసంత్ విహార్లోని తన ఫ్లాట్లో ఆమె ఉరి వేసుకొని కనిపించారు. దీప్తి గదిలో పోలీసులు సూసైడ్ లెటర్ను స్వాధీనం చేసుకున్నారు. అందులో భర్త హర్ప్రీత్ చౌరాసియా పేరును రాసినట్లు తెలుస్తోంది. 2010లో దీప్తి-హర్ప్రీత్ వివాహం చేసుకున్నారు. వారికి 14 ఏళ్ల కుమారుడు ఉన్నారు.


