News April 7, 2025
కుటుంబ సభ్యులపై నీచపు రాజకీయాలా?: తోపుదుర్తి

బంధువుల అమ్మాయితో తాను ఎయిర్పోర్టులో మాట్లాడుతున్న వీడియోను వైరల్ చేస్తూ టీడీపీ శ్రేణులు దుష్ప్రచారం చేస్తున్నాయని మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి మండిపడ్డారు. ‘రేపు జగన్ పాపిరెడ్డిపల్లెకు వస్తున్నారు. ఆ పర్యటనను అడ్డుకునే పరిస్థితి కనపడకపోవడంతో నా బంధువులు, కుటుంబసభ్యులను నీచపు రాజకీయ క్రీడలోకి లాగుతున్నారు. ఆ వీడియోను వైరల్ చేస్తున్న వారిపై పోలీసులకు ఫిర్యాదు చేస్తా’ అని ట్వీట్ చేశారు.
Similar News
News April 8, 2025
విడపనకల్: నేడు ప్రజా సమస్యల పరిష్కార వేదిక

విడపనకల్లో మంగళవారం ప్రజా సమస్యల పరిష్కారం నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ చెప్పారు. ఈ మేరకు సోమవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ హాజరై ప్రజల నుంచి అర్జీలను స్వీకరిస్తారన్నారు. ఉదయం 9 గంటల నుంచి 1 గంట వరకు ప్రజా సమస్యల పరిష్కార వేదిక జరుగుతుందన్నారు. ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు.
News April 7, 2025
రామగిరి హెలిప్యాడ్ వద్ద భద్రత సిబ్బంది తనిఖీలు

రామగిరి మండలం పాపిరెడ్డిపల్లిలో దారుణ హత్యకు గురైన కురుబ లింగమయ్య కుటుంబాన్ని వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఈనెల 8వ తేదీన పరామర్శించనున్నారు. ఉదయం 10.00 గంటలకు రామగిరి మండలం కుంటిమద్ది వద్ద ఏర్పాటుచేసిన హెలిప్యాడ్కు ఆయన చేరుకుంటారు. అక్కడి నుంచి పాపిరెడ్డిపల్లికి బయలుదేరుతారు. ఈ నేపథ్యంలో మంగళవారం హెలిప్యాడ్ వద్ద భద్రత సిబ్బంది పరిశీలించారు.
News April 7, 2025
పాపిరెడ్డిపల్లెకు వైఎస్ జగన్.. హెలిప్యాడ్ మార్పు!

వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ రేపు రాప్తాడు నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ఈ క్రమంలో చెన్నేకొత్తపల్లిలో హెలిప్యాడ్ ఏర్పాటుకు పోలీసులు అనుమతి నిరాకరించినట్లు సమాచారం. కుంటిమద్ది-పాపిరెడ్డిపల్లి వద్ద హెలిప్యాడ్కు అనుమతి ఇచ్చినట్లు తెలిసింది. వైఎస్ జగన్ అక్కడ ల్యాండ్ అయ్యేందుకు నేతలు ఏర్పాట్లు చేస్తున్నారు. పాపిరెడ్డిపల్లెలో ఇటీవల హత్యకు గురైన లింగమయ్య కుటుంబాన్ని ఆయన పరామర్శించనున్నారు.