News April 30, 2024

కుప్పంలోనూ గాజు గ్లాస్ గుర్తు

image

చిత్తూరు జిల్లాలోని పలు నియోజకవర్గాల్లో గాజు గ్లాస్ గుర్తు కూటమి అభ్యర్థులను కలవరపెడుతోంది. చంద్రబాబు పోటీ చేస్తున్న కుప్పంలోనూ గ్లాస్ గుర్తు ఈవీఎంలో ఉండనుంది. ఇక్కడ మొరసన్నపల్లి YCP సర్పంచ్ జగదీశ్ భార్య నీలమ్మ స్వతంత్ర అభ్యర్థిగా ఉండటంతో గ్లాస్ గుర్తు కేటాయించారు. చంద్రగిరి, మదనపల్లె, శ్రీకాళహస్తి, నగరిలోనూ ఇండిపెండెంట్లకు ఈ గుర్తు ఇచ్చారు. అక్కడ ఫలితాలపై ఈ ప్రభావం ఎలా ఉంటుందో చూడాలి మరి.

Similar News

News November 18, 2025

చిత్తూరు జిల్లా రైతులకు రూ.136.46 కోట్లు

image

చిత్తూరు జిల్లాలోని రైతులకు బుధవారం అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్ నిధులు జమకానున్నట్లు జిల్లా వ్యవసాయ శాఖ అధికారి మురళీకృష్ణ వెల్లడించారు. అన్నదాత సుఖీభవ పథకం కింద 2.05 లక్షల మంది రైతులకు రాష్ట్ర ప్రభుత్వం రూ.102.88 కోట్లు విడుదల చేయనుంది. పీఎం కిసాన్ పథకం కింద 1.67లక్షల మంది రైతులకు రూ.33.58 కోట్లను కేంద్ర ప్రభుత్వం రీలీజ్ చేస్తుంది. మొత్తంగా జిల్లా రైతుల ఖాతాల్లో బుధవారం రూ.136.46 కోట్ల జమవుతుంది.

News November 18, 2025

చిత్తూరు జిల్లా రైతులకు రూ.136.46 కోట్లు

image

చిత్తూరు జిల్లాలోని రైతులకు బుధవారం అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్ నిధులు జమకానున్నట్లు జిల్లా వ్యవసాయ శాఖ అధికారి మురళీకృష్ణ వెల్లడించారు. అన్నదాత సుఖీభవ పథకం కింద 2.05 లక్షల మంది రైతులకు రాష్ట్ర ప్రభుత్వం రూ.102.88 కోట్లు విడుదల చేయనుంది. పీఎం కిసాన్ పథకం కింద 1.67లక్షల మంది రైతులకు రూ.33.58 కోట్లను కేంద్ర ప్రభుత్వం రీలీజ్ చేస్తుంది. మొత్తంగా జిల్లా రైతుల ఖాతాల్లో బుధవారం రూ.136.46 కోట్ల జమవుతుంది.

News November 18, 2025

చిత్తూరు జిల్లాలో 27మందిపై క్రమశిక్షణ చర్యలు

image

చిత్తూరు జిల్లా సచివాలయ సిబ్బందికి కలెక్టర్ సుమిత్ కుమార్ షాక్ ఇచ్చారు. ‘జిల్లాలో 612సచివాలయాల్లో 4,477మంది పనిచేయాల్సి ఉంది. 4,040మంది విధులు నిర్వహిస్తుండగా 437మంది డ్యూటీకి రావడం లేదు. ఇందులో 152మంది మెడికల్ లీవ్‌, 251 మంది డిప్యుటేషన్‌పై వేరేచోట పనిచేస్తున్నారు. అనధికారికంగా సెలవుపై ఉన్న 27మందిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలి. మెడికల్ లీవు వాళ్లను మరోసారి చెక్ చేయాలి’ అని కలెక్టర్ ఆదేశించారు.