News April 30, 2024
కుప్పంలోనూ గాజు గ్లాస్ గుర్తు

చిత్తూరు జిల్లాలోని పలు నియోజకవర్గాల్లో గాజు గ్లాస్ గుర్తు కూటమి అభ్యర్థులను కలవరపెడుతోంది. చంద్రబాబు పోటీ చేస్తున్న కుప్పంలోనూ గ్లాస్ గుర్తు ఈవీఎంలో ఉండనుంది. ఇక్కడ మొరసన్నపల్లి YCP సర్పంచ్ జగదీశ్ భార్య నీలమ్మ స్వతంత్ర అభ్యర్థిగా ఉండటంతో గ్లాస్ గుర్తు కేటాయించారు. చంద్రగిరి, మదనపల్లె, శ్రీకాళహస్తి, నగరిలోనూ ఇండిపెండెంట్లకు ఈ గుర్తు ఇచ్చారు. అక్కడ ఫలితాలపై ఈ ప్రభావం ఎలా ఉంటుందో చూడాలి మరి.
Similar News
News May 8, 2025
మంత్రి లోకేశ్తో ఎమ్మెల్యే థామస్ భేటీ

తిరుపతి జిల్లా పర్యటన నిమిత్తం శ్రీ సిటీకి చేరుకున్న మంత్రి లోకేశ్ను GDనెల్లూరు ఎమ్మెల్యే థామస్ మర్యాదపూర్వకంగా కలిశారు. నియోజకవర్గ అభివృద్ధికి సహకరించాలని థామస్, మంత్రిని కోరారు. ఇందుకు మంత్రి సానుకూలంగా స్పందించినట్లు ఆయన పేర్కొన్నారు.
News May 7, 2025
28న చిత్తూరులో జాబ్ మేళా

చిత్తూరు జిల్లా ఉపాధి కల్పన అధికారి కార్యాలయంలో ఈనెల 28న జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు ఎంప్లాయిమెంట్ ఆఫీసర్ పద్మజ తెలిపారు. వివిధ ప్రముఖ కంపెనీల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహిస్తామన్నారు. 19 నుంచి 35 ఏళ్ల లోపు వయసు ఉన్నవారు అర్హులు. ఒరిజినల్ సర్టిఫికెట్లతో ఉదయం 10 గంటలకు ఉపాధి కార్యాలయంలో జరిగే ఇంటర్వ్యూలకు హాజరు కావాలని కోరారు.
News May 7, 2025
సీఎంను కలిసిన రామకుప్పం టీడీపీ నాయకులు

ఇటీవల జరిగిన రామకుప్పం ఎంపీపీ, వైస్ ఎంపీపీ ఎన్నికల్లో ఏకగ్రీవంగా గెలుపొందిన సులోచన గుర్రప్ప, వెంకట్రామయ్య గౌడు శనివారం సీఎం చంద్రబాబును కలిశారు. అమరావతిలోని వెలగపూడి సచివాలయంలో సీఎంను కలిశారు. తమకు అవకాశం కల్పించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. రామకుప్పం మండలాభివృద్ధికి సంబంధించి పలు విషయాలను వారు సీఎం దృష్టికి తీసుకెళ్లారు.