News June 22, 2024
కుప్పంలో చంద్రబాబు పర్యటన షెడ్యూల్ ఇలా..!

ఈనెల 25న సీఎం చంద్రబాబు మధ్యాహ్నం 12:30 గంటలకు పీఈఎస్ మెడికల్ కళాశాలకు చేరుకుంటారు. పట్టణంలో ఒంటిగంటకు అన్న క్యాంటీన్ ప్రారంభిస్తారు. 1.30 గంటలకు ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో బహిరంగ సమావేశంలో మాట్లాడుతారు. 3:30 కి పీఈఎస్ ఆడిటోరియంలో జిల్లా, నియోజకవర్గస్థాయి అధికారులతో సమీక్షిస్తారు. సాయంత్రం 6 గంటలకు ఆర్ & బి గెస్ట్ హౌస్లో నిర్వహించే సమావేశంలో పాల్గొంటారు.
Similar News
News September 16, 2025
TTD టోకెన్ల జారీలో మార్పు

TTD అంగప్రదక్షిణ టోకెన్ల కేటాయింపులో మార్పు చేశారు. ఇప్పటివరకు ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ విధానం ఉండగా, ఇకపై లక్కీడిప్ పద్ధతిలో ఇవ్వనున్నారు. 3నెలల ముందుగా ఆన్లైన్ ద్వారా లక్కీ డిప్లో టోకెన్లు విడుదల చేస్తారు. డిసెంబర్ అంగప్రదక్షిణ టోకెన్ల కోసం సెప్టెంబర్ 18 నుంచి 20వ తేదీ వరకు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. రోజూ 750 టోకెన్లు (శుక్రవారం మినహా) ఉంటాయి.
News September 16, 2025
చిత్తూరు జిల్లాలో లక్ష సంతకాలు సేకరిస్తాం: భాస్కర్

దేశంలో ఓటర్ల జాబితాలో అవకతవకలపై చేపడుతున్న ఉద్యమానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు పోటుగారి భాస్కర్ పిలుపునిచ్చారు. చిత్తూరులో ఆయన మాట్లాడుతూ.. ఓటు చోరీపై చిత్తూరు జిల్లాలో లక్ష సంతకాల సేకరిస్తామని చెప్పారు. ప్రతి పార్టీ బీజేపీకి బానిసలా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. జీడీ నెల్లూరు ఇన్ఛార్జ్ రమేశ్, నేతలు పాల్గొన్నారు.
News September 16, 2025
చిత్తూరు DCMS ఛైర్మన్ మృతి

చిత్తూరు డీసీఎం ఛైర్మన్, టీడీపీ చంద్రగిరి మండల అధ్యక్షుడు పల్లిమేమి సుబ్రహ్మణ్యం నాయుడు మంగళవారం తెల్లవారుజామున మృతిచెందారు. చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో నెల రోజులుగా చికిత్స పొందుతున్నారు. కోలుకోలేక తుది శ్వాస విడిచారు. ఆయన మృతికి పలువురు టీడీపీ నాయకులు సంతాపం తెలిపారు.