News July 17, 2024
కుప్పం ఎయిర్పోర్టు ఏర్పాటుకు ప్రణాళికలు
చిత్తూరు జిల్లా కుప్పంలో ఎయిర్పోర్ట్ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోంది. కుప్పంతో పాటు ఏపీలోని మరో 3 ప్రాంతాల్లో చిన్నతరహా ఎయిర్పోర్ట్లు నిర్మించేందుకు ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా(AAI)కు సీఎం చంద్రబాబు తాజాగా ప్రతిపాదనలు పంపించారు. కాగా చిన్నతరహా ఎయిర్పోర్ట్ నిర్మాణం కోసం 1,800 ఎకరాల భూమి అవసరమవుతుందని రాష్ట్ర ప్రభుత్వానికి AAI వర్గాలు సూచించాయి.
Similar News
News September 30, 2024
తిరుపతి : రేపు వాక్- ఇన్ ఇంటర్వ్యూలు
శ్రీ పద్మావతి చిల్డ్రన్స్ హార్ట్ సెంటర్ నందు కాంట్రాక్టు పద్ధతిలో వివిధ ఉద్యోగాలకు మంగళవారం ఉదయం 10 గంటలకు వాక్ ఇన్ ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నట్లు కార్యాలయం పేర్కొంది. హార్ట్ ట్రాన్స్ ప్లాంట్ కోఆర్డినేటర్, అనస్తీషియా టెక్నీషియన్, జూనియర్/ సీనియర్ ఫిజీషియన్ అసిస్టెంట్ మొత్తం 6 రకాల పోస్టులు 8 ఖాళీలు ఉన్నట్లు తెలిపారు. అర్హత, ఇతర వివరాలకు http://slsmpc.in/ వెబ్ సైట్ చూడాలని సూచించారు.
News September 30, 2024
SVU : ఫీజు చెల్లించడానికి నేడు చివరి తేదీ
SV యూనివర్సిటీ పరిధిలో డిగ్రీ (UG) వార్షిక విధానంలో 1990- 2015 మధ్య ఒక సబ్జెక్టు, 2 అంతకంటే ఎక్కువ సబ్జెక్టులు, ప్రాక్టికల్స్ ఫెయిలైన అభ్యర్థులకు మెగా సప్లిమెంటరీ నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. వీటి పరీక్ష ఫీజు చెల్లించడానికి సోమవారంతో గడువు ముగుస్తుందని యూనివర్సిటీ పరీక్షల విభాగ నియంత్రణధికారి దామ్లా నాయక్ పేర్కొన్నారు. ఫైన్ తో అక్టోబర్ 15 వరకు గడువు ఉన్నట్లు తెలియజేశారు.
News September 30, 2024
సబ్ కలెక్టర్ రేట్ ఫైళ్ల దగ్ధం కేసులో రికార్డులు తీసుకెళ్లిన సిఐడి
మదనపల్లె సబ్ కలెక్టర్ రేట్ లో ఫైళ్ల దగ్ధం అనంతరం సీజ్ చేసిన రికార్థులను ఆదివారం ప్రత్యేకవాహనంలో తిరుపతి సిఐడి కార్యాలయానికి తీసుకెళ్లారు. శనివారం మదనపల్లెకు వచ్చిన సిఐడి డిఎస్పీ వేణుగోపాల్ రెండు రోజులపాటు స్థానిక డిఎస్పీ కార్యాలయంలో కేసులోని కొందరిని విచారించారు. అనంతరం అప్పట్లో కేసుకు సంబంధించి సీజ్ చేసిన రికార్డులు అన్నింటినీ స్వాధీనంచేసుకుని తీసుకెళ్లడంతో ఫైల్ దగ్ధం కేసు మరుగున పడిందనట్లయింది.