News September 8, 2025

కుప్పం బయలుదేరిన నిజామాబాద్ ప్రభుత్వ ఉపాధ్యాయులు

image

నిజామాబాద్ జిల్లాకు చెందిన 41 మంది ప్రభుత్వ ఉపాధ్యాయులు గురువారం కుప్పం బయలుదేరారు. డీఈఓ అశోక్ ఆధ్వర్యంలో వీరంతా అగస్త్య ఫౌండేషన్ నిర్వహించే ‘మేక్ యువర్ ఓన్ ల్యాబ్’ వర్క్‌షాప్‌లో పాల్గొంటారు. నాలుగు రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమంలో సైన్స్, మ్యాథ్స్‌లో ప్రయోగాత్మక పద్ధతులపై శిక్షణ ఇస్తారు. ఈ బృందానికి డీఈఓ అశోక్ వీడ్కోలు పలికారు.

Similar News

News September 9, 2025

ఆర్మూర్: చెరువులో దూకిన మహిళను కాపాడిన పోలీసులు

image

ఆర్మూర్ శివారులోని పెర్కిట్ చెరువులో దూకి ఆత్మహత్యకు యత్నించిన ఓ మహిళను పోలీసులు రక్షించారు. సోమవారం రాత్రి ఈ ఘటన జరిగింది. పెర్కిట్‌కు చెందిన ఓ మహిళ(50) కుటుంబ కలహాల కారణంగా మనస్తాపం చెంది చెరువులోకి దూకింది. విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే స్పందించి ఆమెను సురక్షితంగా బయటికి తీశారు.

News September 8, 2025

NZB: బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడిగా బస్వా లక్ష్మీ నర్సయ్య

image

బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడిగా జిల్లా సీనియర్ నేత బస్వా లక్ష్మీనర్సయ్య నియమితులయ్యారు. ఈ మేరకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు ప్రకటన విడుదల చేశారు. బస్వా లక్ష్మీనర్సయ్య గతంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడిగా, మెదక్ జిల్లా ప్రభారిగా వివిధ బాధ్యతలు నిర్వర్తించారు. 2019 పార్లమెంట్ ఎన్నికల్లో ఎంపీ అర్వింద్ గెలుపులో కీలకపాత్ర పోషించారు.

News September 8, 2025

నిజామబాద్: ఫిర్యాదులు స్వీకరించిన సీపీ

image

నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో సీపీ సాయి చైతన్య అర్జీదారుల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. వారి ఫిర్యాదులను విని పరిష్కారానికి సంబంధిత పోలీసు అధికారులకు పలు సూచనలు చేశారు. ప్రజలు నిర్భయంగా తమ ఫిర్యాదులు అందించవచ్చన్నారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించడమే తమ లక్ష్యమన్నారు. ప్రజావాణిలో మొత్తం 11 ఫిర్యాదులను ఆయన స్వీకరించారు.