News March 18, 2025
కుబీర్: కరెంట్ షాక్తో రైతు మృతి

ప్రమాదవశాత్తు కరెంట్ షాక్తో రైతు మృతి చెందిన ఘటన కుబీర్ మండలంలో చోటుచేసుకుంది. ఎస్ఐ రవీందర్ వివరాల ప్రకారం.. సిర్పెల్లి(H) గ్రామానికి చెందిన పబ్బు గణేశ్(48) సోమవారం వ్యవసాయ భూమిలో మొక్కజొన్నకు నీరు ఇవ్వడానికి వెళ్లాడు. ఇంటికి రాలేదని తన కుమారుడు వెళ్లి చూడగా కరెంట్ షాక్కు గురై గణేశ్ విగతజీవిగా పడి ఉన్నాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు SI తెలిపారు.
Similar News
News November 1, 2025
అమెరికాలో ఉగ్రదాడులకు కుట్ర.. భగ్నం చేసిన ఎఫ్బీఐ

అమెరికాలో ఉగ్ర దాడుల కుట్రను భగ్నం చేసినట్లు FBI డైరెక్టర్ కాశ్ పటేల్ తెలిపారు. మిషిగన్లో హాలోవీన్ వీకెండ్లో హింసాత్మక దాడులకు ప్లాన్ చేసిన పలువురిని అరెస్టు చేసినట్లు ట్వీట్ చేశారు. పూర్తి వివరాలను త్వరలోనే వెల్లడిస్తామని పేర్కొన్నారు. FBI ఏజెంట్లు, అధికారులు దేశాన్ని రక్షిస్తున్నారని అభినందించారు. అంతకుముందు మిషిగన్లో FBI సెర్చ్ ఆపరేషన్స్ నిర్వహించినట్లు డియర్బర్న్ పోలీసులు వెల్లడించారు.
News November 1, 2025
RGM: అధికారులకు విజిలెన్స్ విధానం పై అవగాహన

రామగుండం సింగరేణి సంస్థ GM కార్యాలయంలో శుక్రవారం విజిలెన్స్ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా గెస్ట్ లెక్చరర్ కిషోర్ బగాడియా పాల్గొని ‘విజిలెన్స్- మన భాగస్వామ్య బాధ్యత’ అనే అంశంపై వివరించారు. మనకున్న వనరులను ఉపయోగించి అభివృద్ధి సాధించడం గురించి అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో రామగుండం సింగరేణి సంస్థ RG-1, 2, 3, ALP, భూపాలపల్లి ఏరియాల నుంచి వివిధ విభాగాల అధికారులు పాల్గొన్నారు.
News October 31, 2025
పెద్దపల్లి: ‘NOV 11న యువజనోత్సవ పోటీల నిర్వహణ’

PDPL యువజన క్రీడలశాఖ ఆధ్వర్యంలో NOV 11న 29వ జాతీయ యువజన దినోత్సవం సందర్భంగా యువజన ఉత్సవ పోటీలు నిర్వహించనున్నట్లు డీవైఎస్ఓ సురేష్ తెలిపారు. జానపద నృత్యం, గేయం, కథారచన, పెయింటింగ్, కవిత్వం, ఇన్నోవేషన్ ట్రాక్ పోటీలు జరగనున్నాయి. జిల్లాస్థాయిలో విజేతలు రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక అవుతారని చెప్పారు. ఆసక్తిగల యువతీ యువకులు PDPL అమర్నగర్ సిరి ఫంక్షన్ హాల్లో జరిగే పోటీలలో పాల్గొనాలని పిలుపునచ్చారు.


