News February 26, 2026
కుమ్మెర ఘటన.. నేడు SP సంచలన ప్రెస్మీట్

నాగర్కర్నూల్ జిల్లా కుమ్మెర ఘటనలో చోటుచేసుకున్న ఉద్రిక్తతలు, చిన్నారి మృతిపై జిల్లా SP సంగ్రామ్ సింగ్ జీ పాటిల్ గురువారం విలేకరుల సమావేశం నిర్వహించనున్నారు. ఈ ఘటనపై ఇప్పటికే పోలీసులు లోతైన దర్యాప్తు జరుపుతుండగా, నమోదైన కేసులు, అరెస్టయిన నిందితుల వివరాలను ఆయన వెల్లడించే అవకాశం ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపిన ఈ సున్నితమైన అంశంపై ఎస్పీ ఇచ్చే వివరణపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
Similar News
News February 26, 2026
మారిన మనుషులు.. స్నేహితులే వద్దంట!

బంధాలే కాదు స్నేహాలూ తగ్గిపోయాయని ఓ అధ్యయనంలో వెల్లడైంది. బిజీ లైఫ్స్టైల్, స్మార్ట్ఫోన్ అడిక్షన్తో ఫ్రెండ్షిప్ ఆన్లైన్కే పరిమితమైంది. 1960ల్లో ఒక్కొక్కరికీ వంద మంది స్నేహితులుంటే 1990 సమయంలో ఐదుగురికి, ప్రస్తుతం ఒక్కరికి పడిపోయింది. దేశంలో 15% మందికి అసలు ఫ్రెండ్సే లేరు. దీనిని ‘ఫ్రెండ్షిప్ రిసెషన్’ అంటారు. ఇది ఒంటరితనానికి దారితీసి డిప్రెషన్లోకి నెట్టేస్తుంది. మీకు ఫ్రెండ్స్ ఉన్నారా?
News February 26, 2026
ఇంటర్ ఎగ్జామ్స్: వరంగల్ జిల్లాలో ముగ్గురు డిబార్

వరంగల్ జిల్లా పర్వతగిరి సోషల్ వెల్ఫేర్ గురుకుల పాఠశాలలో గురువారం నిర్వహించిన ఇంటర్ సెకండియర్ తెలుగు పరీక్షలో ముగ్గురు విద్యార్థులు డిబార్ అయినట్లు డీఐఈఓ శ్రీధర్ సుమన్ తెలిపారు. సోషల్ వెల్ఫేర్ సెంటర్లో 191 మందికి 188 మంది హాజరయ్యారు. మోడల్ స్కూల్ సెంటర్లో 177 మంది విద్యార్థులకు గాను 174 పరీక్ష రాశారు. ఒక్కో సెంటర్లో ముగ్గురు విద్యార్థుల చొప్పున ఆబ్సెంట్ అయ్యారు.
News February 26, 2026
తప్పెవరిది? శిక్ష ఎవరికి?

TG: GOVT స్థలాలు, నదీ తీరాల్లో ఆక్రమణలను తొలగించడంలో ప్రభుత్వ నిర్ణయం భేష్. HYDలో హైడ్రా, ఖమ్మం <<19243296>>భూదాన్<<>> వ్యవహారంలో సర్కారు తీరును తప్పు పట్టలేం. కానీ తప్పెవరిది? శిక్ష ఎవరికి? పడుతుందనేదే ప్రశ్న. అక్రమార్కులు రూ.కోట్ల డబ్బు దండుకొని సామాన్యులకు స్థలాలను అంటగట్టారు. కష్టపడి కట్టుకున్న గూడు కూలిపోతుంటే ఇప్పుడు వారి గుండె పగులుతోంది. వీరికి ఆ అక్రమార్కుల నుంచి భారీ పరిహారం ఇప్పిస్తే బాగుంటుంది.


