News October 5, 2025
కురుపాం గురుకుల పాఠశాలకు వారం రోజులు సెలవులు: కలెక్టర్

కురుపాం(M) శివన్నపేట గురుకుల బాలికల పాఠశాలకు వారం రోజులపాటు సెలవులు ఇస్తున్నట్లు కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి ఆదివారం తెలిపారు. రేపటి నుంచి వారం రోజులు సెలవులు ఇస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ముందస్తు జాగ్రత్తలు మెరుగైన వైద్యం కోసం జాండీస్ లక్షణాలున్న విద్యార్థినిలను KGHకు తరలించారు. ప్రతి విద్యార్థి రక్తనమునాలను సేకరించామన్నారు. కాగా పలువురు విద్యార్థులు పార్వతీపురం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
Similar News
News October 5, 2025
సత్యదేవుని ఆలయంలో రథోత్సవం

ప్రసిద్ధ పుణ్యక్షేత్రం అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామివారి ఆలయంలో ప్రతీ ఆదివారం నిర్వహించే రథోత్సవం ఈ రోజు ఘనంగా జరిగింది. వారాంతం కావడంతో రత్నగిరి క్షేత్రానికి అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. భక్తులు స్వయంగా రథోత్సవంలో పాల్గొని స్వామివారి సేవలో తరించారు. వైభవంగా జరిగిన రథోత్సవాన్ని తిలకించి పునీతులయ్యారు.
News October 5, 2025
జొన్నవాడ బ్రిడ్జి వద్ద ఇద్దరు యువకులు గల్లంతు

జొన్నవాడ బ్రిడ్జి వద్ద ఇద్దరు యువకులు గల్లంతైన ఘటన ఆదివారం చోటుచేసుకుంది. నెల్లూరు రూరల్ పెన్నా నదిలో దిగిన యువకులు పైనుంచి వస్తున్న ప్రవాహానికి కొట్టుకుపోయారు. గలంతైన వారు స్థానిక ILM డిపో ప్రాంతానికి చెందిన కోటయ్య (20), విశాల్ (21) గా గుర్తించారు. విశాల్ మృతదేహం లభ్యం కాగా.. కోటయ్య కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
News October 5, 2025
విశాఖలో వీధి వ్యాపారులకు స్ట్రీట్ వెండింగ్ జోన్లు

‘<<17803065>>ఆపరేషన్ లంగ్స్<<>>’లో దుకాణాలు కోల్పోయిన వీధి వ్యాపారులకు 21 ప్రాంతాల్లో GVMC స్ట్రీట్ వెండింగ్ జోన్లను ఏర్పాటు చేసింది. మొత్తం 649దుకాణాలకు స్థలాలను గుర్తించింది. చిరువ్యాపారులు ఉపాధి కోల్పోకుండా ఉండేందుకు వీలుగా ఈజోన్లు ఏర్పాటు చేశారు. UCDఆధ్వర్యంలో 8జోన్లలో మొత్తం 18,041 వీధి వ్యాపారులను గుర్తించారు. వీరిలో ఇప్పటి వరకు UCDకి 6,755 మంది మాత్రమే రూ.200 చెల్లించి గుర్తింపుకార్డు పొందారు.