News October 28, 2025
కురుమూర్తి జాతర.. భారీ బందోబస్తు- SP

మహబూబ్నగర్ జిల్లా ‘చిన్న తిరుపతి’గా ప్రసిద్ధి గాంచిన కురుమూర్తి స్వామి జాతర సందర్భంగా భక్తుల రక్షణ,శాంతిభద్రతల పరిరక్షణ కోసం భారీ బందోబస్తు ఏర్పాట్లు చేసినట్లు ఎస్పీ డీ.జానకి తెలిపారు. మొత్తం 680 మంది పోలీసు సిబ్బందిని మోహరించామని, జాతర ప్రాంగణం మొత్తం సీసీ కెమెరాల నిగ్రహంలో ఉండి, 24 గంటల కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామన్నారు. ఏవైనా ఇబ్బందులు ఎదుర్కొంటే వెంటనే కంట్రోల్ రూమ్లో తెలుపాలన్నారు.
Similar News
News October 28, 2025
ప్రారంభమైన వరి ధాన్యం, మొక్కజొన్న, పత్తి కొనుగోళ్లు: కలెక్టర్

వరి ధాన్యం, మొక్కజొన్న, పత్తి కొనుగోలు కేంద్రాలను HNK జిల్లాలో ప్రారంభమైనట్లు కలెక్టర్ స్నేహ శబరీష్ తెలిపారు. పంటల ఉత్పత్తులు కొనుగోలు చేసేందుకు అన్ని ఏర్పాట్లను పూర్తి చేసినట్లు పేర్కొన్నారు. కేంద్రాలలో గన్నీ సంచులు, టార్పాలిన్లు, ప్యాడీ క్లీనర్లు, తేమ మీటర్లు, ఎలక్ట్రానిక్ కాంటాలు ఏర్పాటు చేశామన్నారు. కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఎలాంటి సమస్యలు ఉన్నా 7330751364ను సంప్రదించాలని సూచించారు.
News October 28, 2025
అక్టోబర్ 28: చరిత్రలో ఈరోజు

1867: స్వామి వివేకానంద బోధనలకు ప్రభావితమై హిందూమతాన్ని స్వీకరించిన మొదటి విదేశీ మహిళ సిస్టర్ నివేదిత జననం
1909: రచయిత కొడవటిగంటి కుటుంబరావు జననం
1924: నటి సూర్యకాంతం జననం (ఫొటోలో)
1959: సినీ నటుడు గోవిందరాజు సుబ్బారావు మరణం
☛ అంతర్జాతీయ యానిమేషన్ డే
News October 28, 2025
ముచ్చటగా మూడు షాపులు దక్కించుకున్న మహిళ

మహబూబాబాద్ జిల్లాలోని ఓ మహిళను అదృష్టం వరించింది. లక్కీ డ్రాలో ముచ్చటగా మూడు వైన్ షాపులను దక్కించుకుంది. హైదరాబాద్లోని జూబ్లీహిల్స్కు చెందిన ఎన్.శ్రీవాణికి డోర్నకల్ పట్టణంలో గౌడ కేటగిరీలో రెండు షాపులు రాగా.. ముల్కలపల్లిలో సైతం ఓ షాప్ వచ్చింది. దీంతో వారి ఆనందానికి హద్దులు లేవు. మీకు తెలిసిన వారికి లక్కీ డ్రాలో షాప్లు వస్తే కామెంట్లో తెలపండి.


