News December 27, 2024
కులగణనపై సచివాలయాల పరిధిలో సామాజిక సర్వే: విశాఖ జేసీ

జిల్లాలో చేపట్టిన కులగణనను పారదర్శకంగా చేపట్టాలని విశాఖ జేసీ మయూర్ అశోక్ అధికారుల ఆదేశించారు. గురువారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. షెడ్యూల్ కులాల సామాజిక, ఆర్థిక అభివృద్ధి అంశాలపై సమీక్ష చేసేందుకు, పథకాలు అమలు చేసేందుకు, మెరుగైన పాలసీ రూపకల్పన కోసం నిర్వహించిన కులగణనపై గ్రామ, వార్డు సచివాలయాల పరిధిలో సామాజిక సర్వే(సోషల్ ఆడిట్)ను చేపడుతున్నట్లు వెల్లడించారు.
Similar News
News September 20, 2025
రక్షణే లక్ష్యంగా జీవీఎంసీ చర్యలు: కమిషనర్

ఆపరేషన్ లంగ్స్-2.0తో పాదచారుల భద్రత, వాహనదారుల రక్షణ లక్ష్యంగా జీవీఎంసీ చర్యలు చేపడుతోందని కమీషనర్ కేతన్ గార్గ్ శనివారం తెలిపారు. ఫుట్పాత్లు, రోడ్లు, జంక్షన్లపై అనధికార వ్యాపారాలు, ఫుడ్ స్టాళ్లు ఏర్పాటు చేస్తే చర్యలు తీసుకోబడతాయన్నారు. స్వచ్ఛందంగా ఖాళీ చేసినవారికి వెండింగ్ జోన్లు కేటాయిస్తామని వెల్లడించారు. ఆక్రమణల రహిత పరిశుభ్రమైన నగరం కోసమే ఈ కార్యాచరణ చేపడుతున్నామని స్పష్టం చేశారు.
News September 20, 2025
9 నెలల్లో మాస్టర్ ప్లాన్ రోడ్ల నిర్మాణం పూర్తి చేయాలి: వీఎంఆర్డీఏ ఛైర్మన్

మాస్టర్ ప్లాన్ రహదారుల నిర్మాణాన్ని 9 నెలల్లో పూర్తి చేయాలని వీఎంఆర్డీఏ ఛైర్మన్ ప్రణవ్ గోపాల్ ఆదేశించారు. ఇంజినీరింగ్ అధికారులతో నిర్వహించిన సమీక్షలో మాట్లాడుతూ.. రహదారుల నిర్మాణంలో నాణ్యత పాటించాలన్నారు. జాతీయస్థాయి స్కేటింగ్ పోటీల కోసం కూడా వుడా పార్కులో స్టేట్ బోర్డు పనులు పూర్తి చేయాలన్నారు. అనంతరం అడివివరం- శొంఠ్యాం, శొంఠ్యాం-గుడిలోవ పనులను పరిశీలించారు.
News September 20, 2025
విశాఖలో ఈ గవర్నెన్స్ సదస్సుపై సమీక్ష

విశాఖలో ఈ నెల 22,23న జరిగే ఈ గవర్నెన్స్ జాతీయ సదస్సుపై ఐటి విభాగం కార్యదర్శి కాటమనేని భాస్కర్ శనివారం సమీక్షించారు. రెండు రోజుల సదస్సుకు వెయ్యి మంది ప్రతినిధులు వస్తారన్నారు. కొందరు పర్యాటక ప్రాంతాలను సందర్శించే అవకాశం ఉందన్నారు. దానికి తగ్గట్లు ఏర్పాట్లు చేయాలన్నారు. సదస్సు జరగనున్న హోటల్ వద్ద వైద్య బృందాలను అందుబాటులో ఉంచాలన్నారు.