News October 19, 2025
కులాంతర వివాహం.. 20 మందికి రూ.2.50 లక్షల చొప్పున

జనగామ: కులాంతర వివాహం చేసుకున్న వారికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి ప్రోత్సాహకం కింద రూ.2.50 లక్షలు అందజేస్తున్నాయి. మంజూరైన ఈ ప్రోత్సాహక నిధులను దంపతుల జాయింట్ అకౌంట్లో మూడేళ్లపాటు ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తారు. ఈ పథకం కింద జనగామ జిల్లాలో 2019 నుంచి ఇప్పటివరకు 20 మంది దంపతులకు ప్రోత్సాహకం అందినట్లు అధికారులు తెలిపారు. ఇంకా 70 మందికి పైగా లబ్ధిదారులకు ఈ ప్రోత్సాహకం అందాల్సి ఉందని పేర్కొన్నారు.
Similar News
News October 20, 2025
తొగుట: కస్తూర్బా పాఠశాల.. కలెక్టర్ ఆకస్మిక తనిఖీ

తొగుటలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాన్ని జిల్లా కలెక్టర్ కె.హైమావతి ఆకస్మికంగా సందర్శించారు. రాత్రివేళల్లో విద్యార్థులకు అందించే భోజనం నాణ్యతను ఆమె పరిశీలించారు. వంటగదికి వెళ్లి మెనూ ప్రకారం బీరకాయ కూర, సాంబారు పెడుతున్నారా అని ఆరా తీశారు. అటెండెన్స్ రిజిస్టర్ తనిఖీ చేస్తూ, రాత్రి విధులు నిర్వహించే అధ్యాపకులు సక్రమంగా బాధ్యతలు నిర్వర్తించాలని ఆదేశించారు.
News October 20, 2025
రేపు ప్రజావాణి రద్దు: భద్రాద్రి కలెక్టర్

దీపావళి పర్వదినం సందర్భంగా సోమవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టరేట్లో జరగాల్సిన ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు కలెక్టర్ జితేష్ వి పాటిల్ ఒక ప్రకటన ద్వారా తెలియజేశారు. పండుగ సందర్భంగా జిల్లా అధికారులు ఉండరని, ఈ అంశాన్ని జిల్లా ప్రజలు గమనించి ఎవరు కూడా కలెక్టరేట్కు రావద్దని సూచించారు
News October 20, 2025
తప్పిన పెను ప్రమాదం

బండి ఆత్మకూరు- పార్నపల్లె గ్రామాల మధ్య ఆదివారం రాత్రి రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. నారాయణపురం గ్రామానికి చెందిన విష్ణు, హెడ్ కానిస్టేబుల్ రమణ రావు కారులో వెళ్తుండగా వెనుక నుంచి వస్తున్న లారీ ఢీ కొట్టింది. దీంతో కారు పంట కాలువలోకి దూసుకెళ్లింది. అదృష్టవశాత్తు కారులో ఉన్న వారికి ఎలాంటి ప్రాణాపాయం లేకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు.