News April 10, 2025
కువైట్లో కాకినాడ జిల్లా మహిళపై యాసిడ్ దాడి

భర్త మృతితో కుటుంబ పోషణ కోసం కువైట్ వెళ్లిన మహిళ యాసిడ్ దాడికి గురై అక్కడ చిక్కుకుపోయింది. యూ.కొత్తపల్లి మండలం పొన్నాడకు చెందిన కాకాడ లక్ష్మి భర్త చనిపోవడంతో కువైట్లో పనికి వెళ్లింది. కడపకు చెందిన ఓ ఏజెంట్ ఆమెను 2నెలల క్రితం పంపించాడు.150 దీనార్ల జీతమని చెప్పి 100 దీనార్లే ఇవ్వడంతో ఆమె ప్రశ్నించింది. దీంతో యాసిడ్తో దాడి చేశాడు. ఈ విషయం ఆమె కుటుంబీకులకు తెలియడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Similar News
News November 4, 2025
GNT: బ్యాడ్ న్యూస్.. ఈసారి లేనట్టే..!

బాపట్ల సూర్యలంక బీచ్ను నవంబర్ 4, 5 తేదీలలో (మంగళవారం, బుధవారం) తాత్కాలికంగా మూసివేసినట్లు RDO తెలిపారు. తుఫాను సముద్రంలో ఏర్పడిన చిన్న చిన్న గుంటల కారణంగా సంబంధిత శాఖల అధికారుల రిపోర్టుల ఆధారంగా భక్తులు, పర్యాటకులను అనుమతించమన్నారు. తదుపరి భద్రతా పరిశీలన చేసి ప్రకటన ఇచ్చేవరకు మూసివేయడమైనదని తెలిపారు. కాగా ఉమ్మడి జిల్లా ప్రజలకు కార్తీక పౌర్ణమికి ఈసారి సముద్ర స్నానం లేనట్టే..!
News November 4, 2025
విశాఖలో భూప్రకంపనలు

AP: విశాఖలో స్వల్ప భూకంపం సంభవించింది. తెల్లవారుజామున 4 గంటల నుంచి 4.30 గంటల మధ్య పలు ప్రాంతాల్లో భూమి కంపించింది. విశాఖలోని గాజువాక, మధురవాడ, రుషికొండ, భీమిలి, కైలాసపురం, మహారాణిపేట, విశాలాక్షినగర్, అక్కయ్యపాలెం తదితర ప్రాంతాల్లో కొన్ని సెకన్ల పాటు భూమి కంపించింది. కొన్నిచోట్ల శబ్దాలు కూడా వచ్చినట్లు స్థానికులు చెబుతున్నారు. మీ ప్రాంతంలోనూ భూకంపం వచ్చినట్లు అనిపించిందా? కామెంట్ చేయండి.
News November 4, 2025
రబ్బర్ బోర్డ్లో 51 పోస్టులకు నోటిఫికేషన్

<


