News February 8, 2025
కూకట్పల్లిలో వివాహిత SUICIDE
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739009281156_51657750-normal-WIFI.webp)
ఆర్థిక ఇబ్బందులు తాళలేక వివాహిత ఆత్మహత్య చేసుకున్న ఘటన కూకట్ పల్లి పీఎస్ పరిధిలోని సుమిత్రానగర్లో చోటుచేసుకుంది. ఎస్ఐ దీక్షిత తెలిపిన వివరాల ప్రకారం.. ఏపీలోని తూర్పు గోదావరి జిల్లాకు చెందిన బీశెట్టి కనక రత్నమ్మ (46) ఇంట్లో సీలింగ్ ఫ్యాన్కు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. మృతురాలి భర్త సత్తిబాబు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టామని పోలీసులు తెలిపారు.
Similar News
News February 8, 2025
ఆసిఫాబాద్ జిల్లాలో నేటి ముఖ్యాంశాలు
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739025406719_20574997-normal-WIFI.webp)
*ఆసిఫాబాద్ జిల్లాలో బీజేపీ నాయకుల సంబరాలు*కావేటి సమ్మయ్యను గుర్తు చేసుకున్న KTR* వాంకిడిలో రోడ్డు ప్రమాదం.. వ్యక్తి మృతి* రెబ్బెన: జాతరకు పటిష్ఠ భద్రత:SP* ఆర్టీసీని ప్రభుత్వ పరం చేయాలి: JAC
News February 8, 2025
పెంబి: పురుగుమందు తాగి వివాహిత మృతి
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739022931531_51420205-normal-WIFI.webp)
పురుగు మందు తాగి వివాహిత మృతి చెందిన ఘటన పెంబి మండలంలో చోటుచేసుకుంది. ఎస్సై హనుమండ్లు తెలిపిన వివరాల ప్రకారం.. పోచంపల్లికి చెందిన మాలావత్ సానుక(22)ను ఆమె భర్త ఈనెల 3న మొక్కజొన్న పంటకు నీళ్లు పారీయమని చెప్పగా ఆమె క్షణికావేశానికి లోనై పురుగుల మందు తాగిందన్నారు. ఆమెను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తుండగా శనివారం మృతి చెందినట్లు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.
News February 8, 2025
లిక్కర్ స్కామ్లో భాగమైన మూడు పార్టీలు బలి!
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739028081068_1032-normal-WIFI.webp)
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసుతో సంబంధమున్న మూడు పార్టీలు తమ రాష్ట్రాల్లో అధికారాన్ని కోల్పోయాయి. తెలంగాణలో బీఆర్ఎస్, ఏపీలో వైసీపీ, ఢిల్లీలో ఆప్లు ఓటమి చవిచూశాయి. లిక్కర్ స్కామ్లో ఆప్ నుంచి మనీశ్ సిసోడియా, కేజ్రీవాల్, బీఆర్ఎస్ నుంచి కల్వకుంట్ల కవిత, వైసీపీ నుంచి మాగుంట రాఘవరెడ్డికి ఈ కేసుతో సంబంధాలు ఉన్నాయి. ఇదే కేసులో వీరందరూ ఢిల్లీ తిహార్ జైలుకు వెళ్లి బెయిల్పై విడుదలయ్యారు.