News July 10, 2025

కూకట్‌పల్లి: కల్తీ కల్లులో అత్యధికంగా మత్తుమందు

image

కల్తీ కల్లు ఘటనలో అధికారులు వివరాలు వెల్లడించారు. హైదర్‌నగర్, HMT హిల్స్, సర్దార్ పటేల్‌నగర్, భాగ్యనగర్ కాలనీలోని కల్లు కాంపౌండ్‌లోని శాంపిల్స్ సేకరించారు. భాగ్యనగర్ కాలనీ మినహా మిగతా మూడింట్లో మత్తుమందు అల్ఫాజోలం ఎక్కువగా ఉన్నట్లు నివేదిక వెల్లడించారు. నిందితులు రవితేజగౌడ్, సాయితేజగౌడ్, నగేశ్‌గౌడ్, శ్రీనివాస్‌గౌడ్‌ను అరెస్టు చేసి కోర్టులో హాజరు పరిచినట్లు బాలానగర్ ఎక్సైజ్ పోలీసులు తెలిపారు.

Similar News

News July 11, 2025

మద్దూర్: పురుగుమందు తాగి మహిళ ఆత్మహత్య

image

ఓ మహిళ పురుగుమందు తాగి మృతి చెందిన ఘటన మద్దూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ధమగ్నాపూర్‌లో చోటుచేసుకుంది. ఎస్ఐ విజయ్ తెలిపిన వివరాలు.. ఈనెల 8వ తేదీన గ్రామానికి చెందిన జోగు మౌనిక ఆర్థిక(35) ఇబ్బందులతో పురుగుమందు తాగింది. చికిత్స కుటుంబసభ్యులు నిమిత్తం HYD నిమ్స్‌కి తరలించారు. చికిత్స పొందుతూ గురువారం మృతిచెందింది. ఈమేరకు కేసు నమోదైంది.

News July 11, 2025

ఏటూరునాగారం: GREAT.. 2 కి.మీ నడిచి వైద్య శిబిరం

image

జ్వరం వస్తే ఆసుపత్రికి రావాలని, సొంత చికిత్సలు చేసుకోవద్దని ఏటూరునాగారం మండలం గంటలకుంట గుత్తికోయలకు వైద్యాధికారి సుమలత సూచించారు. గ్రామానికి సరైన రోడ్డు మార్గం లేకపోవడంతో సుమారు 2 కి.మీ నడిచి హెల్త్ క్యాంపు నిర్వహించినట్లు తెలిపారు. క్యాంపులో 28 మందికి పరీక్షలు నిర్వహించి, జ్వరాల బారిన పడ్డ ఐదుగురికి మందులను పంపిణీ చేశామన్నారు. వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని సూచించినట్లు పేర్కొన్నారు.

News July 11, 2025

రాయపర్తి: తల్లి చెంతకు వచ్చి వెళ్తుండగా అనంత లోకాలకు!

image

తల్లి చెంతకు వచ్చి తిరిగి వెళ్తుండగా కుమారుడు అనంతలోకాలకు వెళ్లిన ఘటన ఆ గ్రామంలో అందరిని కలచివేసింది. వరంగల్ జిల్లా రాయపర్తి మండలంలోని మైలారం గ్రామానికి చెందిన గాడిపెళ్లి వెంకటయ్య-రజిత దంపతుల కుమారుడు రంజిత్(24) హైదరాబాదులో ఓ ప్రైవేటు ఉద్యోగం చేస్తున్నాడు. ఐదేళ్ల క్రితం తండ్రి చనిపోవడంతో తల్లి గ్రామంలోనే ఉంటోంది. తల్లిని చూసి తిరిగి వెళ్తుండగా పాలకుర్తిలో బస్సు ప్రమాదంలో మృతి చెందాడు.