News August 23, 2025

కూకట్‌పల్లి: డబ్బుల కోసం వచ్చాడా? బ్యాట్ కోసమా?

image

కూకట్‌పల్లిలో సహస్ర హత్య కేసు నిందితుడిని అదుపులోకి తీసుకున్న అనంతరం సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. ఓటీటీలో సినిమాలు చూసి ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లే స్పష్టం అవుతోంది. మరోవైపు దొంగతనం చేయడానికి ఇంట్లోకి రావడమే కాకుండా, ఓ బ్యాట్ గురించి ఈ హత్య జరిగినట్లు భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి. దీనిపై స్పష్టత ఇచ్చేందుకు పోలీసు ఉన్నతాధికారులు నేడు మీడియా సమావేశాన్ని నిర్వహించే అవకాశం ఉందని తెలుస్తోంది.

Similar News

News August 23, 2025

కంటిచూపు కోల్పోయిన హోంగార్డుకి సీపీ సాయం

image

విధి నిర్వహణలో అనారోగ్యానికి గురైన ఓ హోం గార్డుకి కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం అండగా నిలిచారు. కొత్తపల్లి పోలీస్ స్టేషన్‌లో బ్లూ కోల్ట్స్ విధులు నిర్వహిస్తున్న హోంగార్డు శివకుమార్ హై బీపీ కారణంగా కంటి చూపు కోల్పోయారు. ఆయన వైద్య ఖర్చుల నిమిత్తం రూ.1.5 లక్షల ఆర్థిక సహాయాన్ని సీపీ శుక్రవారం అందించారు. ప్రస్తుతం శివకుమార్‌కు కంటిచూపు వచ్చింది. కాగా, ఆయన నిన్ననే తిరిగి విధుల్లో చేరారు.

News August 23, 2025

రథం గుట్టను పరిశీలించిన జిప్ లైన్ అడ్వెంచర్ బృందం

image

మణుగూరు గుట్ట మల్లారం వద్ద గల రథం గుట్ట ప్రాంతాన్ని జిప్ లైన్ అడ్వెంచర్ బృందం శుక్రవారం పరిశీలించింది. భద్రాద్రి జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ ఆదేశాల మేరకు ఈ ప్రాంతం పర్యాటక కేంద్రంగా మార్చుటకు పరిశీలనకు వచ్చామని బృందం సభ్యులు తెలియజేశారు. మణుగూరు రథం గుట్టను పరిశీలించిన జిప్ లైన్ అడ్వెంచర్ బృందం పూర్తిస్థాయిలో పరిశీలన చేసి నివేదికను ప్రభుత్వానికి అందజేస్తామని పేర్కొన్నారు.

News August 23, 2025

RR: ఆరోగ్యంపై అప్రమత్తంగా ఉండాలి: కలెక్టర్

image

ప్రతి ఒక్కరూ ఆరోగ్యంపై అప్రమత్తంగా ఉండాలని రంగారెడ్డి కలెక్టర్ నారాయణరెడ్డి సూచించారు. శుక్రవారం ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్లు, వైద్యారోగ్యశాఖ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. పారిశుద్ధ్య నిర్వహణ, తాగునీటి సరఫరా, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం వంటి అంశాలపై చర్చించారు. సీజనల్ వ్యాధులపై ప్రజలను అప్రమత్తం చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు. సోమవారం నుంచి ఫీవర్ సర్వే నిర్వహించాలన్నారు.