News August 22, 2025

కూకట్‌పల్లి: సహస్ర హత్య.. పోలీసుల అదుపులో బాలుడు

image

సహస్ర హత్య కేసులో పక్క భవనంలో ఉన్న బాలుడే ఈ దారుణానికి వడిగట్టినట్టు పోలీసులు గుర్తించారు. ఇప్పటికే బాలుడిని అదుపులోకి తీసుకున్న ప్రత్యేక బృందాలు విచారణ చేపట్టారు. హత్య జరిగిన కూతవేటు దూరంలో ఉన్న పాఠశాలల్లోనే ఆ బాలుడు చదువుతున్నట్లు పోలీసులు తెలిపారు. ప్రస్తుతం బాలుడిని విచారణ చేయడంలో భాగంగా అదుపులోకి తీసుకున్నారు. మరిన్ని వివరాలను విచారణ అనంతరం తెలియజేస్తామని తెలిపారు.

Similar News

News August 22, 2025

ఎవరా లీకువీరుడు..?

image

TG సెక్రటేరియట్‌లో కొందరు హై లెవల్ అధికారులకు టెన్షన్ పట్టుకుంది. దీనికి కారణం.. PC ఘోష్ కమిషన్ రిపోర్టును KCR కోర్టులో సవాల్ చేయడం. కాళేశ్వరంపై ఘోష్ ఇచ్చిన 600పేజీల నివేదికను ప్రభుత్వం ప్రజలకు 60పేజీల సమ్మరీ రిపోర్టుగా రిలీజ్ చేసింది. అయితే KCR 600పేజీల కాపీతో HCకి వెళ్లడంతో ఆయనకు కాపీ ఎవరిచ్చారని CMO విచారిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో సంబంధిత IASలు ఆందోళనలో పడినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.

News August 22, 2025

మెదక్: రేపు డయల్ యువర్ డీఎం

image

మెదక్ ఆర్టీసీ డిపోలో శనివారం డయల్ యువర్ డీఎం కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు మెదక్ ఆర్టీసీ డిపో మేనేజర్ సురేఖ శుక్రవారం తెలిపారు. రేపు ఉదయం11 గంటల నుంచి మధ్యాహ్నం 12:00 గంటల వరకు కార్యక్రమం ఉంటుందన్నారు. ప్రయాణికులు తమ సందేహాల నివృత్తికి 7842651592 నంబర్‌కు కాల్ చేయాలన్నారు. ఈ సందర్భంగా ఆర్టీసీ సౌకర్యాలపై సలహాలు, సూచనలు ఇవ్వవచ్చని డీఎం పేర్కొన్నారు.

News August 22, 2025

కంచికచర్లలో రోడ్డు ప్రమాదం.. తల్లి, బిడ్డ మృతి

image

కంచికచర్ల మండలం కీసర గ్రామంలో శుక్రవారం మధ్యాహ్నం జరిగిన రోడ్డు ప్రమాదంలో పసికందు మృతిచెందిన <<17483745>>విషయం తెలిసిందే<<>>. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన తల్లి నాగబత్తిని చైతన్యను మెరుగైన చికిత్స కోసం విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ ఆమె చికిత్స పొందుతూ మరణించినట్లు ఎస్ఐ విశ్వనాథ్ తెలిపారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.