News April 2, 2024
కూటమిలో BJP కలవాలని నేనూ కృషి చేశా: RRR

TDP-జనసేన కూటమితో BJP కలవాలని పవన్ కృషి చేశారని, ఇదే విషయమై ఎవరికీ తెలియకుండా తాను ఎన్నో రోజులు ఢిల్లీలో గడిపానని నరసాపురం MP రఘురామకృష్ణరాజు అన్నారు. ‘రచ్చబండ’లో భాగంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. చిన్న సమాచార లోపంతో తనకు టికెట్ రాలేదని, ఒకట్రెండు రోజుల్లో చంద్రబాబు న్యాయం చేస్తారనే నమ్మకం ఉందన్నారు. నియంతను నువ్వెంత అని ప్రశ్నించిన వ్యక్తినని, ప్రజల కోసమే ఒంటరి పోరాటం చేస్తున్నానని ఆయన తెలిపారు.
Similar News
News July 9, 2025
ఈనెల 10న రెండో విడత తల్లికి వందనం: కలెక్టర్ నాగరాణి

సాంఘిక సంక్షేమ వసతి గృహాల్లో నూరు శాతం అడ్మిషన్స్ జరగాలని, వసతి గృహాల్లో మెరుగైన మౌలిక వసతులను కల్పిస్తున్నామని కలెక్టర్ నాగరాణి అన్నారు. మంగళవారం జిల్లా కలెక్టరేట్లో జరిగిన అధికారుల సమీక్షలో ఆమె మాట్లాడారు. ఈనెల 10న రెండో విడత తల్లికి వందనం సొమ్మును విద్యార్థుల తల్లుల ఖాతాలో జమ చేయనున్నారని, ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తల్లికి వందనం కార్యక్రమాన్ని నిర్వహిస్తోందన్నారు.
News July 8, 2025
‘పేదలను ఆదుకునేందుకు శ్రీమంతులు ముందుకు రావాలి’

పీ-4 కార్యక్రమంలో భాగంగా మార్గదర్శకుల నమోదు ప్రక్రియపై అధికారులు ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలని జేసీ రాహుల్ అన్నారు. మంగళవారం జేసి ఛాంబర్లో జరిగిన సమావేశంలో మాట్లాడారు. పేద వర్గాలను ఆదుకునేందుకు జిల్లాలోని శ్రీమంతులు స్వచ్ఛందంగా ముందుకు రావాలన్నారు. ప్రభుత్వ ఉద్యోగులు కూడా మార్గ దర్శకులుగా రిజిస్టర్ చేసుకొని బంగారు కుటుంబాలను దత్తత తీసుకోవచ్చునని అన్నారు.
News July 8, 2025
ఈనెల 14 వరకు పశుగ్రాస వారోత్సవాలు: కలెక్టర్

పశుగణాభివృద్ధితో పాటు మేలురకం పశుగ్రాసలసాగు ద్వారా అధిక పాల ఉత్పత్తి, పునరుత్పత్తి సామర్ధ్యం పెంపుదలకు ఈనెల 14 వరకు నిర్వహించే పశుగ్రాస వారోత్సవాలను సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ నాగరాణి తెలిపారు. పశుగ్రాసం విత్తనాలను పశువైద్యశాలలో రైతుసేవ కేంద్రాల ద్వారా అందించనున్నట్లు పేర్కొన్నారు. రేపు వెంకట రామన్నగూడెంలో మేలుజాతి పశుగ్రాసాల ప్రదర్సన, పాడి రైతులకు అవగాహన సదస్సు నిర్వహిస్తున్నామన్నారు.