News August 7, 2025
కూసుమంచి: యూటీ పనులను పరిశీలించిన ఇరిగేషన్ సీఈ, ఎస్ఈ

కూసుమంచి మండలం పాలేరు సాగర్ ఎడమ కాలువ వద్ద రూ.14 కోట్లతో నిర్మిస్తోన్న యూటీ(అండర్ టన్నెల్) పనులను గురువారం ఇరిగేషన్ శాఖ సీఈ, ఎస్ఈ మంగళపూడి వెంకటేశ్వర్లు పరిశీలించారు. వారు మాట్లాడుతూ.. మంత్రి ఆదేశాల మేరకు యుద్ధ ప్రాతిపదికన పనులను గుత్తేదారు గోపాలరావు మూడు షిప్టుల్లో పగలు, రాత్రి తేడా లేకుండా నాణ్యత ప్రమాణాలతో పూర్తి చేశారని, మిగిలిన చిన్న పనులను త్వరగా పూర్తి చేయాలన్నారు.
Similar News
News August 8, 2025
ఖమ్మం జిల్లాను పర్యాటక హబ్గా అభివృద్ధి చేయాలి: కలెక్టర్

ఖమ్మం జిల్లాను పర్యాటక హబ్గా అభివృద్ధి చేయాలని కలెక్టర్ అనుదీప్ పేర్కొన్నారు. గురువారం ఖమ్మం ఖిల్లా, జాఫర్ బావి, నేలకొండపల్లి బౌద్ధ స్థూపాన్ని సందర్శించి, పర్యాటక అభివృద్ధి పనులను సమీక్షించారు. రూ.29 కోట్లతో ఖిల్లా వద్ద రోప్ వే నిర్మాణం చేపడుతున్నామన్నారు. అంతర్జాతీయ స్థాయిలో బౌద్ధ క్షేత్రాన్ని అభివృద్ధి చేయాలని, మ్యూజియం, పార్క్, బోటింగ్, రెస్టారెంట్ ఏర్పాటుకు ప్రణాళికలు చేస్తున్నామని చెప్పారు.
News August 7, 2025
ఖమ్మం: జల్ జీవన్ మిషన్పై కలెక్టర్లకు వీసీ

జల్ జీవన్ మిషన్ పనులపై కేంద్ర అదనపు కార్యదర్శి కమల్ కిషోర్ సోన్ ఈరోజు వీడియో కాన్ఫరెన్స్ను నిర్వహించారు. తెలంగాణ, ఝార్ఖండ్, అరుణాచల్ కలెక్టర్లతో వీసీలో ఖమ్మం కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి పాల్గొన్నారు. మిషన్ పనులను పర్యవేక్షించేందుకు డాష్ బోర్డు ఏర్పాటు చేసినట్లు కమల్ కిషోర్ తెలిపారు. ప్రతి జిల్లా పరిధిలోని పనులను పర్యవేక్షించాలని, దిశ సమావేశాలను రెగ్యులర్గా నిర్వహించి, ఆన్లైన్లో ఉంచాలన్నారు.
News August 7, 2025
ఖమ్మం జిల్లా కలెక్టర్ కీలక ఆదేశాలు

ఖమ్మం జిల్లాలో రెవెన్యూ సదస్సుల ద్వారా వచ్చిన 75,000 భూ సమస్యల దరఖాస్తుల పరిష్కారాన్ని ఆగస్టు 15 నాటికి పూర్తి చేయాలని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అధికారులను ఆదేశించారు. 49,000 సాదా బైనామా దరఖాస్తులకు వెంటనే నోటీసులు ఇవ్వాలని తెలిపారు. ప్రతి దరఖాస్తును వేగంగా, పారదర్శకంగా పరిష్కరించాలని, ర్యాండమ్ చెకింగ్ ద్వారా తప్పులు నివారించాలని సూచించారు. సెలవులు లేకుండా రెవెన్యూ సిబ్బంది కృషి చేయాలన్నారు.