News October 5, 2024

కృష్ణగిరిలో 48.2 మి.మీ వర్షం

image

కర్నూలు జిల్లాలో వర్షం దంచికొట్టింది. కృష్ణగిరిలో అత్యధికంగా 48.2 మి.మీ వర్షం కురిసింది. గురువారం నుంచి శుక్రవారం ఉదయం వరకు 25 మండలాల్లో వాన పడింది. జిల్లాలో సగటున 12.6 మి.మీ వర్షం నమోదైంది. అత్యల్పంగా ఎమ్మిగనూరులో 2.4, చిప్పగిరి 2.0, హాలహర్విలో 1.0 మి.మీ వర్షం కురిసింది. భారీ వర్షంతో ఆదోని వ్యవసాయ మార్కెట్‌ యార్డులో వివిధ పంట దిగుబడులు తడిచిపోయాయి. నేడు మార్కెట్‌ యార్డుకు సెలవు ప్రకటించారు.

Similar News

News October 5, 2024

రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలకు విద్యార్థిని ఎంపిక

image

రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలకు నందికొట్కూరులోని ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థిని హబ్షిబా ఎంపికైనట్లు కళాశాల ప్రిన్సిపల్ షేక్షావలి, ఫిజికల్ డైరెక్టర్ రియాజుద్దీన్ శుక్రవారం తెలిపారు. కర్నూలు స్టేడియంలో సెప్టెంబర్ 26న జరిగిన అండర్-19 స్కూల్ గేమ్స్ ఉమ్మడి కర్నూలు జిల్లా కబడ్డీ పోటీలలో హబ్షిబా ప్రతిభ కనబరచి రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలకు ఎన్నికైనట్లు పేర్కొన్నారు.

News October 5, 2024

ఆదోని వ్యవసాయ మార్కెట్‌ యార్డుకు నేడు సెలవు

image

ఆదోనిలోని స్థానిక వ్యవసాయ మార్కెట్‌ యార్డుకు శనివారం సెలవు ప్రకటించినట్లు మార్కెట్‌ యార్డు సెక్రటరీ రామ్మోహన్‌రెడ్డి తెలిపారు. ఇవాళ ఎలాంటి క్రయ, విక్రయాలు జరగవన్నారు. రెండ్రోజులుగా వర్షం కురుస్తుండగా తుఫాను ప్రభావంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. నిన్న కురిసిన వర్షానికి మార్కెట్‌కు తెచ్చిన వివిధ పంట దిగుబడులు తడిచిపోయాయని తెలిపారు.

News October 5, 2024

స్వర్ణాంధ్ర@2047 జిల్లా ప్రణాళిక సిద్ధం చేస్తున్నాం: కలెక్టర్

image

స్వర్ణాంధ్ర @2047 ప్రణాళికలో భాగంగా రాబోయే 23 సంవత్సరాలలో నంద్యాల జిల్లా అన్ని రంగాలలో అభివృద్ధి సాధించే దిశగా ప్రణాళిక రచన సిద్ధం చేస్తున్నామని కలెక్టర్ రాజకుమారి పేర్కొన్నారు. శుక్రవారం కలెక్టరేట్‌లో స్వర్ణాంధ్ర @2047 జిల్లా దార్శనిక పత్ర ప్రణాళికపై అధికారులు, ప్రజాప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థలు, వివిధ రంగాల స్టేక్ హోల్డర్స్‌లతో జిల్ల స్థాయి సమీక్ష నిర్వహించారు.