News August 21, 2025
కృష్ణా: ఆ ఎరువులు మాకొద్దు బాబోయ్!

ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఎరువుల కొరత ఉందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాకు లక్ష మెట్రిక్ టన్నుల ఎరువులు అవసరం కాగా, కేవలం 65 వేల మెట్రిక్ టన్నులు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. అందులో 25 శాతం ద్రవ రూపంలో ఉన్న నానో యూరియా. అయితే నానో యూరియా వల్ల పంటకు బలం చేకూరదని రైతులు వాపోతున్నారు. బయట మార్కెట్లో రూ.400-450కి ఎరువులు అమ్ముతున్నారని, బిల్లులు కూడా ఇవ్వడం లేదని రైతులు చెబుతున్నారు.
Similar News
News August 21, 2025
KNR: వృద్ధులపై కఠినంగా బిడ్డలు

పింఛన్, ఆస్తి.. కారణమేదైనా మలిదశలో తల్లిదండ్రులను కాదనే ప్రభుద్ధులెందరో ఉమ్మడి KNRలో ఇప్పటికీ ఉన్నారు. కొన్నినెలల క్రితం JGTL(D)వెల్గటూర్, రాయికల్, కోరుట్లల్లో వివిధకారణాలతో బిడ్డల నుంచి భరోసా కరవై వృద్ధులు రోడ్డెక్కారు. తాజాగా KNR(D)శంకరపట్నం మొలంగూర్లో ఓ కొడుకు<<17470521>> తల్లిని బయటకు గెంటేసి<<>> ఇంటికి తాళమేసుకున్నాడు. ఇలాంటి బాధితులు RDOలు, పోలీసులు, వయోవృద్ధుల సంక్షేమశాఖ అధికారులను కలిసి న్యాయం పొందొచ్చు.
News August 21, 2025
కొనసాగుతున్న ఏపీ క్యాబినెట్ భేటీ

AP: సీఎం చంద్రబాబు అధ్యక్షతన రాష్ట్ర సచివాలయంలో క్యాబినెట్ భేటీ కొనసాగుతోంది. సీఆర్డీఏ పరిధిలో అభివృద్ధికి రూ.904 కోట్ల మంజూరు, రాజధాని ప్రాంతంలో కొన్ని సంస్థలకు భూ కేటాయింపులు, జిల్లాల పునర్విభజన, పలు జిల్లాల పేర్ల మార్పుతో పాటు కొత్త జిల్లాల ఏర్పాటు తదితర అంశాలపై చర్చ జరుగుతోంది. కాసేపట్లో మంత్రివర్గ భేటీ నిర్ణయాలను మంత్రులు మీడియాకు వెల్లడించనున్నారు.
News August 21, 2025
HYD: ఒక్క పిల్లర్ నిర్మాణం వెనక నెలల కష్టం

ఉప్పల్ రింగ్ రోడ్డు నుంచి ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణ పనుల్లో వేగం పుంజుకుంది. ఒక్క పిల్లర్ నిర్మాణం వెనుక నెలల కష్టం ఉంటుందని ఇంజినీర్లు తెలిపారు. పిల్లర్ల నిర్మాణం ఇన్ సిట్యూ పద్ధతిలో అక్కడే జరుగుతుంది. పిల్లర్ల నిర్మాణంలో ఫౌండేషన్ ఒకేత్తయితే, పైభాగం(వెబ్) నిర్మాణం మరో ఎత్తు. పిల్లర్పై భాగం నిర్మాణానికి భారీ స్థాయిలో స్టీల్ అవసరం ఉంటుందని AE అనిల్ తెలిపారు.