News July 15, 2024
కృష్ణా: ఇంటింటి సర్వే ద్వారా కుష్టు వ్యాధిగ్రస్తుల గుర్తింపు

కుష్టు వ్యాధిగ్రస్తులను గుర్తించేందుకు ఈ నెల 18 నుంచి ఆగస్ట్ 2వ తేదీ వరకు జిల్లాలో ఇంటింటి సర్వే నిర్వహించనున్నట్టు జాయింట్ కలెక్టర్ గీతాంజలి శర్మ తెలిపారు. ఇందుకు సంబంధించిన కరపత్రాలను సోమవారం ఆమె కలెక్టరేట్లో ఆవిష్కరించారు. ఆమె మాట్లాడుతూ.. జిల్లాలో మొత్తం 1403 సర్వే బృందాలను ఏర్పాటు చేశామన్నారు. ఈ సర్వే బృందాలు ఇంటింటికీ వెళ్లి కుష్టు వ్యాధి లక్షణాలు ఉన్న వారిని గుర్తించడం జరుగుతుందన్నారు.
Similar News
News December 19, 2025
నేరాల నివారణే లక్ష్యం.. పోలీసుల గస్తీ

కృష్ణా జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు ఆదేశాలతో పోలీసులు రాత్రివేళ ముమ్మరంగా పెట్రోలింగ్ నిర్వహించారు. ప్రార్థనా స్థలాలు, ఏటీఎంలు, వ్యాపార కేంద్రాలను తనిఖీ చేస్తూ భద్రతపై నిఘా ఉంచారు. హైవేలపై డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు నిర్వహించడంతో పాటు, ‘ఫేస్ వాష్ & గో’ కార్యక్రమం ద్వారా వాహనదారులకు రోడ్డు ప్రమాదాలపై అవగాహన కల్పించారు. ఆపద సమయంలో డయల్ 100ను ఆశ్రయించాలని పోలీసులు ప్రజలకు సూచించారు.
News December 18, 2025
మచిలీపట్నం: తీర ప్రాంత రక్షణపై ఎంపీ బాలశౌరి కసరత్తు

మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి బుధవారం కేంద్ర భూమి, శాస్త్ర మంత్రిత్వ శాఖ కార్యదర్శి ఎం.రవిచంద్రన్తో భేటీ అయ్యారు. కోడూరు అవుట్ఫాల్ స్లూయిస్ పునర్నిర్మాణం, చిన్నగొల్లపాలెం తీరప్రాంత కోత నివారణపై చర్చించారు. దీనిపై క్షేత్రస్థాయి సర్వే నిర్వహించి DPR సిద్ధం చేయాలని, నిధుల కోసం విపత్తు నిర్వహణ సంస్థలను సంప్రదించాలని కార్యదర్శి సూచించారు. ఈ చర్యలతో తీరప్రాంత గ్రామాలకు రక్షణ కల్పించే అవకాశం ఉంది.
News December 18, 2025
20న గుణదలలో జిల్లా జట్ల ఎంపికలు

కృష్ణా జిల్లా షూటింగ్ బాల్ సంఘం ఆధ్వర్యంలో డిసెంబర్ 20న గుణదలలో సీనియర్ పురుషుల, మహిళల జిల్లా జట్ల ఎంపికలు నిర్వహిస్తున్నట్లు జిల్లా షూటింగ్ బాల్ సంఘం అధ్యక్షులు రాజశేఖర్ తెలిపారు. జిల్లాలో ఆసక్తి గల క్రీడాకారులు ఎవరైనా ఒరిజినల్ ఆధార్తో హాజరు కావాలన్నారు. ఇక్కడ ఎంపికైన క్రీడాకారులు ప్రకాశం జిల్లా కరేడులో డిసెంబర్ 25, 26 తేదీలలో జరగబోయే రాష్ట్ర స్థాయి షూటింగ్ బాల్ పోటీలలో పాల్గొంటారన్నారు.


