News July 19, 2024
కృష్ణా: ఈ నెల 21న చెస్ జట్ల ఎంపిక పోటీలు

గుడివాడ త్రివేణి స్కూల్లో ఈ నెల 21న కృష్ణా జిల్లా అండర్-11 బాలబాలికల చెస్ జట్ల ఎంపిక పోటీలు జరగనున్నాయి. ఈ మేరకు జిల్లా చెస్ సంఘ కార్యదర్శి NM ఫణికుమార్ ఒక ప్రకటన విడుదల చేశారు. ఆసక్తి గల బాలలు ఈ నెల 20లోపు తమ పేర్లు నమోదు చేసుకోవాలన్నారు. ఈ పోటీల్లో ఎంపికైనవారు ఈ నెల 27, 28 తేదీలలో భీమవరంలో జరిగే రాష్ట్ర స్థాయి పోటీల్లో కృష్ణా జిల్లా తరఫున ఆడతారని ఫణికుమార్ చెప్పారు.
Similar News
News March 2, 2026
మచిలీపట్నంలో మరో ఫోన్ నంబర్

మచిలీపట్నం ఆర్టీసీ బస్టాండ్లోని సమాచార కేంద్రంలో ప్రస్తుతం ఉన్న ల్యాండ్ లైన్ ఫోన్ నంబర్ తోపాటు కొత్తగా సెల్ ఫోన్ నంబర్ 94947 75462ను అందుబాటులోకి తీసుకువచ్చినట్లు డిపో మేనేజర్ పెద్దిరాజు తెలిపారు. ప్రయాణికులు విచారణ నిమిత్తం గతంలో ఉన్న ల్యాండ్ లైన్ నంబర్ 08672-227000తోపాటు నూతన సెల్ నెంబర్ 94947 75462ను సద్వినియోగం చేసుకోవాలని డీఎం కోరారు.
News March 2, 2026
కృష్ణా: గణితం పరీక్షకు 255 మంది గైర్హాజరు

ఇంటర్మీడియట్ పరీక్షల్లో భాగంగా సోమవారం ప్రథమ సంవత్సరం గణితం పరీక్ష నిర్వహించారు. కృష్ణా జిల్లాలో మొత్తం 63 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించారు. 15,100 మంది విద్యార్థులకు గాను 14,845 మంది హాజరయ్యారని, 255 మంది గైర్హాజరైనట్లు ఇంటర్మీడియట్ జిల్లా విద్యాధికారి సరళాదేవి తెలిపారు. ఎటువంటి మాల్ ప్రాక్టీస్ కేసు నమోదు కాలేదన్నారు.
News March 2, 2026
కృష్ణా: మందుగుండు దుకాణాలపై పోలీసుల సోదాలు

కాకినాడలోని వేట్లపాలెంలో ఇటీవల సంభవించిన పేలుడు ఘటన నేపథ్యంలో కృష్ణాజిల్లా వ్యాప్తంగా పోలీసులు అప్రమత్తమయ్యారు. జిల్లాలో ఉన్న మందుగుండు సామగ్రి స్థావరాలు, పటాకుల దుకాణాలలో విస్తృతంగా సోదాలు నిర్వహిస్తూ స్టాక్ వివరాలను సేకరిస్తున్నారు. నివాస ప్రాంతాల మధ్యలో అక్రమంగా మందుగుండు సామగ్రి నిల్వ ఉంచినట్లు సమాచారం అందిన చోట్ల ప్రత్యేక తనిఖీలు చేపడుతున్నారు.


