News March 27, 2024
కృష్ణా : ఈ నెల 30తో ముగియనున్న ధాన్యం కొనుగోళ్ల గడువు
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_32024/1711520308399-normal-WIFI.webp)
ఈ నెల 30వ తేదీతో ఖరీఫ్ ధాన్యం సేకరణ గడువు ముగుస్తుందని జాయింట్ కలెక్టర్ గీతాంజలి శర్మ బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఇప్పటి వరకు జిల్లాలో 55,562 మంది రైతుల నుండి 1070.07కోట్లు విలువ గల 4,88,590 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని రైతు భరోసా కేంద్రాల ద్వారా సేకరించినట్లు చెప్పారు. ధాన్యం సేకరణ గడువు ముగుస్తున్న నేపథ్యంలో ఇంకనూ ధాన్యం విక్రయించని రైతులు వెంటనే రైతు భరోసా కేంద్రాల ద్వారా విక్రయించుకోవాలన్నారు.
Similar News
News July 5, 2024
విజయవాడ: నేటి నుంచి తిరుమల ఎక్స్ ప్రెస్ రద్దు
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_72024/1720148174589-normal-WIFI.webp)
తిరుమల ఎక్స్ ప్రెస్ను జులై 5 నుంచి 11వ తేదీ వరకూ రద్దు చేస్తున్నట్లు రైల్వే శాఖ అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. విజయవాడ సమీపంలో నాన్ ఇంటర్ లాకింగ్ పనులు జరుగుతుండటంతో తాత్కాలికంగా తిరుమల ఎక్స్ ప్రెస్ రద్దు చేస్తున్నట్లు చెప్పారు. రాజమండ్రి మీదుగా తిరుపతి వెళ్లే ప్రయాణికులు ఈ అసౌకర్యాన్ని గమనించాలని కోరారు.
News July 5, 2024
NTR: పిల్లలు పుట్టడం లేదని వివాహిత ఆత్మహత్య
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_72024/1720141043324-normal-WIFI.webp)
NTRజిల్లా కంభంపాడుకి చెందిన శేషుకుమార్కి TG మహబూనగర్ జిల్లా శిర్సనగండ్లకు చెందిన రాజశ్రీ(29)తో 2014లో పెళ్లయింది. 10ఏళ్లయినా పిల్లలు పుట్టడం లేదని ఇద్దరూ గొడవపడుతూ ఉండేవారు. దీంతో మనస్తాపం చెందిన రాజశ్రీ ఇంటిలో ఎవరూ లేని సమయంలో పురుగుమందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. నల్గొండ జిల్లా మాల్లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా చికిత్సపొందుతూ..బుధవారం రాత్రి మృతిచెందారు. ఘటనపై కేసు నమోదు చేశారు.
News July 5, 2024
కృష్ణమ్మకు సిద్ధమైన మరో మణిహారం
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_72024/1720148005533-normal-WIFI.webp)
విజయవాడ పశ్చిమ బైపాస్ రోడ్డు నిర్మాణంలో భాగంగా సూరాయపాలెం వద్ద కృష్ణా నదిపై భారీ వంతెన కడుతున్నారు. ఈ వంతెన నిర్మాణ పనులు చకచకా సాగుతున్నాయి. NHAIఆధ్వర్యంలో రూపుదిద్దుకుంటున్న ఈ వంతెన చూపరులను ఆకట్టుకుంటోంది. ఈ రహదారి పూర్తయితే హైదరాబాద్, ఏలూరు నుంచి వచ్చే వాహనాలు విజయవాడ నగరంలోకి రాకుండా గొల్లపూడి మీదుగా కాజ వద్ద చెన్నై హైవేను చేరుకోవచ్చు.