News March 12, 2025

కృష్ణా ఎక్స్‌ప్రెస్‌ ప్రయాణించే రూట్‌లో మార్పులు 

image

విజయవాడ, కొండపల్లి మీదుగా తిరుపతి(TPTY)- ఆదిలాబాద్(ADB) మధ్య ప్రయాణించే కృష్ణా ఎక్స్‌ప్రెస్‌ ప్రయాణించే రూట్‌లో రైల్వే శాఖ మార్పులు చేసింది. సికింద్రాబాద్ స్టేషన్‌లో అభివృద్ధి పనులు చేస్తున్నందున నం.17405 TPTY- ADB రైలు ఈ నెల 26, నం.17406 ADB- TPTY రైలు ఈ నెల 27 నుంచి ఆ స్టేషన్లలో ఆగదని రైల్వే అధికారులు తెలిపారు. ప్రయాణికుల సౌకర్యార్థం ఈ రైళ్లను పై తేదీల నుంచి చర్లపల్లి మీదుగా నడుపుతున్నామన్నారు.

Similar News

News March 12, 2025

దామరగిద్ద : రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి…!

image

దామరగిద్ద మండలం మొగల్ మడక గ్రామంలో వరి నాట్లు వేసుకున్న రైతులకు భూగర్భ జలాలు ఇంకిపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు. పంట ఎండిపోవడంతో పశువులకు మేతగా వాడుతున్నారు. ప్రభుత్వం నష్టపోయిన రైతులకు న్యాయం చేయాలని రైతులు కోరుతున్నారు. రాష్ట్ర జోనల్ కార్యదర్శి వెంకోబ, జిల్లా సహాయ కార్యదర్శి మల్లికార్జున్ ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళ్తామని హామీ ఇచ్చారు.

News March 12, 2025

పండగే.. వచ్చే 19 రోజుల్లో 8 రోజులు సెలవులు

image

ఐటీ, ITES ఉద్యోగులకు రానున్న రెండు వారాలు ఆఫీసులకు వెళ్లినట్లే అన్పించదు. ఎందుకంటే మాసంలో మిగిలిన 19 రోజుల్లో 8 రోజులు సెలవులే. 14న హోలీ, 15-16 వీకెండ్ కావడంతో వరుసగా మూడ్రోజులు హాలీడే. ఇక 22-23 వీకెండ్. తిరిగి 29న వీకెండ్, 30 సండే+ఉగాది ఉండగా 31న రంజాన్ సందర్భంగా సెలవు. మొత్తం 8 సెలవుల్లో 2సార్లు 3 రోజుల చొప్పున లాంగ్ వీకెండ్ వస్తుంది. దీంతో సరదాగా ట్రిప్‌కు వెళ్లే వారు ప్లాన్స్ మొదలుపెట్టారు.

News March 12, 2025

కళ్లు పొడిబారుతున్నాయా? ఈ చిట్కాలు పాటించండి

image

కంప్యూటర్ ముందు వర్క్ చేస్తున్నప్పుడు మధ్య మధ్యలో 20సెకన్ల పాటు కళ్లను మూసి విశ్రాంతి నివ్వాలని నిపుణులు సూచిస్తున్నారు. స్క్రీన్‌ను కళ్లకు తక్కువ ఎత్తులో ఉండేలా చూసుకోండి. రాత్రివేళల్లో సెల్‌ఫోన్ వాడకం తగ్గించండి. లైటింగ్ వల్ల కంటి చిన్నకండరాలు త్వరగా అలసిపోతాయి. ఏసీ, కూలర్ నుంచి వచ్చే గాలులు నేరుగా కంటిమీద పడనివ్వకండి. గోరువెచ్చని నీటితో శుభ్రపరచండి. బ్లూలైట్ ఫిల్టర్ గ్లాసెస్ వాడటం బెటర్.

error: Content is protected !!