News April 6, 2024

కృష్ణా: చంద్రబాబు రేపటి పర్యటన షెడ్యూల్ వివరాలు

image

టీడీపీ అధినేత చంద్రబాబు ఆదివారం మధ్యాహ్నం 3 నుంచి 4.30 వరకు పామర్రు ఎన్టీఆర్ సెంటర్‌లో బహిరంగ సభ నిర్వహించనున్నట్లు టీడీపీ శ్రేణులు తెలిపారు. సభ అనంతరం చంద్రబాబు రోడ్డు మార్గాన ఉయ్యూరు మార్కెట్ సెంటర్ చేరుకొని సాయంత్రం 6 నుంచి 7.30 వరకు బహిరంగ సభ నిర్వహిస్తారని చెప్పారు. ఈ మేరకు సంబంధిత వర్గాలు చంద్రబాబు రేపటి పర్యటనల షెడ్యూల్ విడుదల చేశాయి. 

Similar News

News July 18, 2024

కృష్ణా: నేటితో ముగియనున్న దరఖాస్తు గడువు

image

కేంద్ర ప్రభుత్వం ఉపాధ్యాయులకు అందించే “నేషనల్ టీచర్ అవార్డ్స్-2024″కు దరఖాస్తు చేసుకునే గడువు నేటితో ముగియనుంది. ఈ అవార్డులకు దరఖాస్తు చేసుకునే ఉపాధ్యాయులు https://nationalawardstoteachers.education.gov.in/ అధికారిక వెబ్‌సైట్‌లో అప్లై చేసుకోవాల్సి ఉంటుందని కేంద్ర విద్యాశాఖ తెలిపింది. ఎంపిక ప్రక్రియ అనంతరం సెప్టెంబర్ 4, 5 తేదీలలో అవార్డులు అందజేస్తామని పేర్కొంది.

News July 18, 2024

కృష్ణా: ‘పామాయిల్ సాగుతో దీర్ఘకాలిక అధిక ఆదాయం’

image

పామాయిల్ సాగుతో దీర్ఘకాలం అధిక ఆదాయం పొందవచ్చని, ఆ దిశగా రైతులను ప్రోత్సహించాలని కలెక్టర్ బాలాజీ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో గురువారం ఆయన జిల్లాలో ఉన్న పతాంజలి, వాహ్యన్ కాఫీ, 3ఎఫ్ పామాయిల్ కంపెనీ ప్రతినిధులు, ఉద్యానవన శాఖ అధికారులతో సమావేశమయ్యారు. పామాయిల్ సాగు విధానం, బిందు సేద్యం, సాగుకు ప్రభుత్వం కల్పిస్తున్న వివిధ రాయితీలు, రైతుల నుంచి కంపెనీలు పంట సేకరించే విధానంపై ఆయన చర్చించారు. 

News July 18, 2024

గన్నవరం చేరుకున్న మాజీ సీఎం జగన్

image

బెంగళూరు పర్యటనను ముగించుకొని మాజీ సీఎం జగన్ గురువారం సాయంత్రం గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు. జగన్‌కు విమానాశ్రయంలో వైసీపీ నాయకులు స్వాగతం పలికారు. అక్కడ నుంచి రోడ్డు మార్గంలో ఆయన తాడేపల్లికి బయలుదేరి వెళ్లారు. పల్నాడు జిల్లా వినుకొండలో వైసీపీ కార్యకర్త రషీద్‌ను దారుణంగా హత్య చేసిన నేపథ్యంలో రేపు వినుకొండ వెళ్లి రషీద్ కుటుంబ సభ్యులను జగన్ పరామర్శించనున్నారు.