News January 25, 2026
కృష్ణా జిల్లాలో ముగ్గురికి పద్మశ్రీ అవార్డులు

కృష్ణా జిల్లాకు చెందిన ముగ్గురు ప్రముఖులకు పద్మశ్రీ అవార్డులు దక్కాయి. పమిడిముక్కలకు చెందిన ఆంకాలజిస్ట్ డా. నోరి దత్తాత్రేయుడు, గుడ్లవల్లేరుకు చెందిన ప్రముఖ వేదాంత పండితుడు వెంపటి కుటుంబ శాస్త్రి, నిమ్మకూరుకు చెందిన ప్రముఖ సినీ హీరో రాజేంద్ర ప్రసాద్కు పద్మశ్రీ అవార్డులు లభించాయి. వీరి ముగ్గురు ఆయా రంగాలకు చేసిన సేవలకుగాను కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ అవార్డులను ప్రకటించింది.
Similar News
News February 13, 2026
కృష్ణాజిల్లా MLAల ప్రోగ్రెస్ ఇదే

కృష్ణాజిల్లా MLAలతో CM చంద్రబాబు గురువారం సమావేశం అయ్యారు. MLAల పనితీరును బట్టి వారికి ప్రోగ్రెస్ రిపోర్టులు అందించారు. పనితీరులో పామర్రు ప్రథమ స్థానం, పెనమలూరు రెండో స్థానంలో ఉందన్నారు. నియోజకవర్గాల్లో జనసేన, BJP నేతలతో సమన్వయం పెంచాలన్నారు. అవనిగడ్డలో TDP, జనసేన మరింత కలిసి పనిచేయాలని సూచించారు. కూటమి పొత్తు ధర్మాన్ని పాటిస్తూ ప్రజలకు చేరువగా పనిచేయాలని సూచించారు.
News February 13, 2026
కృష్ణా: అప్పుడు ఓడిన నేతకు ఇప్పుడు ఛాన్స్ ఇస్తారా.?

2020లో జరిగిన రాజ్యసభ సభ్యుల ఎన్నికలలో టీడీపీ నుంచి సీనియర్ నేత వర్ల రామయ్య పోటీలో నిలిచారు. అప్పుడు టీడీపీకి శాసనసభ్యుల సంఖ్యాబలం లేకపోవడంతో ఆయనకు నిరాశే దక్కింది. ప్రస్తుతం ఏపీ నుంచి 4 స్థానాలు ఖాళీ అవుతుండటంతో కూటమి నుంచి పెద్దల సభకు ఎవరిని పంపుతారోననే చర్చ జోరుగా నడుస్తోంది. ఈ సారి వర్లకు టీడీపీ అధిష్ఠానం ఛాన్స్ ఇస్తోందేమో మరికొద్ది రోజుల్లో తెలియనుంది.
News February 13, 2026
కృష్ణా: భార్య పుట్టింటికి వెళ్లిందని భర్త సూసైడ్

భార్య పుట్టింటికి వెళ్లిందని భర్త ఉరేసుకొని సూసైడ్ చేసుకున్న ఘటన గురువారం చోటుచేసుకుంది. కానూరు కుమ్మర్లబజార్కు చెందిన బండి క్రాంతికుమార్ 7 నెలల కిందట చిన్నముత్తేవికి చెందిన అమలరాణిని పెళ్లి చేసుకున్నాడు. ఆమె గర్భిణిగా ఉన్న సమయంలో పుట్టింటికి వెళ్లే విషయమై ఇద్దరి మధ్య విభేదాలొచ్చాయి. ఈ నెల 11న జరిగిన వాగ్వాదం అనంతరం ఆమె పుట్టింటికి వెళ్లగా, భర్త ఉరేసుకొని మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు.


