News April 4, 2024

కృష్ణా జిల్లాలో రోడ్డు ప్రమాదం.. దంపతుల మృతి

image

జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదంలో వృద్ధ దంపతులు మృతి చెందారు. స్థానికుల వివరాల ప్రకారం.. గురువారం ఘంటసాల మండలం లంకపల్లి వద్ధ ఈ ప్రమాదం చోటుచేసుకుంది. చల్లపల్లి మండలం మాజేరు శివారు పచ్చార్లంకకు చెందిన దాసరి నాగేశ్వరరావు- సరోజినీ దంపతులు ద్విచక్ర వాహనంపై తెల్లవారు జామున లంకపల్లి వస్తుండగా లారీని ఢీకొని అక్కడికక్కడే మృతి చెందారు.

Similar News

News September 10, 2025

కృష్ణా : రీవాల్యూషన్ నోటిఫికేషన్ విడుదల

image

కృష్ణా యూనివర్సిటీ(KRU) పరిధిలోని కళాశాలల్లో ఇటీవల నిర్వహించిన యూజీ(హానర్స్) 8వ సెమిస్టర్ పరీక్షలకు సంబంధించి రీ వాల్యుయేషన్ నోటిఫికేషన్ తాజాగా విడుదలైంది. ఈ పరీక్షలకు సంబంధించి రీ వాల్యుయేషన్ కోరుకునే విద్యార్థులు ఈ నెల 17వ తేదీలోగా ఒక్కో పేపరుకు రూ.8,00 ఫీజు ఆన్లైన్లో చెల్లించాల్సి ఉంటుందని వర్శిటీ పరీక్షల విభాగం కంట్రోలర్ పి.వీరబ్రహ్మచారి సూచించారు

News September 9, 2025

కృష్ణా: బ్యూటిఫుల్ మూన్

image

బాపులపాడు గన్నవరం ఉంగుటూరు మండలాలలో ఆకాశం తన అందాలతో మంగళవారం రాత్రి మాయ చేసింది. నింగిలో మెరిసిన నిండు చంద్రుడు ప్రజల చూపులను కట్టిపడేశాడు. వెండి వెలుగులు విరజిమ్ముతూ ప్రకృతి తన మహిమను ఆవిష్కరించింది. నగరాల్లోనూ, గ్రామాల్లోనూ ఆ వెన్నెల విందు చూసేందుకు ప్రజలు ఆసక్తిగా బయటకు వచ్చి చిత్రాల్లాంటి దృశ్యాలను కెమెరాలో బంధించారు. మరి మీ ప్రాంతంలో ఈరోజు చంద్రుడు ఎలా ఉన్నాడో కామెంట్ చేయండి.

News September 9, 2025

కృష్ణా జిల్లాలో టుడే టాప్ న్యూస్

image

☞ తప్పుడు ప్రచారాలు చేస్తే చర్యలు: కృష్ణా ఎస్పీ
☞ ఉమ్మడి కృష్ణాజిల్లాలో 105 R&B రోడ్లు ధ్వంసం
☞ కృష్ణా జిల్లా వ్యాప్తంగా వైసీపీ అన్నదాత పోరు కార్యక్రమం
☞  మచిలీపట్నం – రేపల్లె రైల్వే లైనుకు కృషి చేయాలి: బాలశౌరి
☞ మోపిదేవి ఆలయంలో భక్తుల రద్దీ