News October 16, 2025

కృష్ణా జిల్లాలో హైలెవల్ బ్రిడ్జి నిర్మాణానికి అనుమతి

image

కృష్ణా జిల్లాలో హైలెవెల్ బ్రిడ్జి నిర్మాణానికి ప్రభుత్వం అనుమతి ఇవ్వడంతో జిల్లా ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పెనమలూరు మండలం పోరంకి వద్ద హైలెవల్ బ్రిడ్జి నిర్మాణానికి అనుమతి ప్రభుత్వం ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. బందరు కాలువపై బ్రిడ్జి నిర్మాణానికి రూ. 49.6 కోట్లు మంజూరు చేస్తూ గురువారం ఉత్తర్వులు విడుదల చేశారు. దీంతో రాకపోకలకు మార్గం సుగమం అయ్యేలా హై లెవెల్ బ్రిడ్జి నిర్మాణం జరుగనుంది.

Similar News

News October 17, 2025

NZB: 102 వైన్స్‌లకు దరఖాస్తులు ఎన్నంటే?

image

NZB జిల్లాలోని 102 వైన్ షాప్‌లకు సంబంధించి గురువారం వరకు 687 దరఖాస్తులు వచ్చాయని జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ మల్లారెడ్డి తెలిపారు. NZB ఫరిధిలోని మొత్తం 36 వైన్ షాపుల్లో 11 షాప్లకు 234 దరఖాస్తులు, BDN- మొత్తం18 వైన్ షాప్‌లకు 168, ARMR- 25 షాప్‌లకు 135, భీంగల్-12 వైన్ షాపులకు 65, మోర్తాడ్ పరిధిలో 11 వైన్ షాపులకు 85 దరఖాస్తులు వచ్చాయని ఆయన వివరించారు.

News October 17, 2025

బంగ్లా ప్లేయర్ల వాహనాలపై ఫ్యాన్స్ దాడి!

image

స్వదేశంలో బంగ్లాదేశ్ క్రికెట్ టీమ్‌కు ఘోర పరాభవం జరిగినట్లు తెలుస్తోంది. అఫ్గనిస్థాన్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో 0-3 తేడాతో ఓడిపోవడమే ఇందుకు కారణంగా చెబుతున్నారు. బంగ్లాదేశ్ చేరుకున్న ప్లేయర్ల వాహనాలపై దాడికి పాల్పడినట్లు వార్తలు వస్తున్నాయి. ఆఖరి వన్డేలో 200 రన్స్ తేడాతో ఓడిపోవడాన్ని ఫ్యాన్స్ జీర్ణించుకోలేకపోయారు. ‘కొన్నిసార్లు ఓటమి తప్పదు’ అని ప్లేయర్లు అభిమానులకు సర్దిచెప్పే ప్రయత్నం చేశారు.

News October 17, 2025

కంది: భారత జట్టు కబడ్డీ కోచ్‌గా శ్రీనివాస్ రెడ్డి

image

ఆసియా గేమ్స్‌లో పాల్గొనే భారత కబడ్డీ జట్టుకు కోచ్‌గా కంది మండలం ఉత్తర్ పల్లి గ్రామానికి చెందిన శ్రీనివాస్ రెడ్డి ఎంపికయ్యారు. ఈనెల 19 నుంచి 23వ తేదీ వరకు బెహ్రెయిన్‌లో జరిగే 3వ యూత్ ఆసియన్ గేమ్స్‌లో పాల్గొనే భారత కబడ్డీ అబ్బాయిల టీంకు కోచ్‌గా వ్యవహరిస్తారు. శ్రీనివాస్ రెడ్డి నియామకంపై తెలంగాణ కబడ్డీ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు వీరేష్, ప్రధాన కార్యదర్శి మహేందర్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు.