News August 13, 2025

కృష్ణా జిల్లాలో 83 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు

image

కృష్ణా జిల్లాలో అధిక వర్షాలు, వరద పరిస్థితులను నిరంతరం పర్యవేక్షిస్తూ అప్రమత్తంగా ఉన్నామని జిల్లా ఇన్‌ఛార్జి కలెక్టర్ గీతాంజలి శర్మ మంత్రి అనితకు వివరించారు. 62 దుర్బల గ్రామాలు, 16 లంక గ్రామాల ప్రజలను అప్రమత్తం చేశామన్నారు. బోట్లు, రవాణా సదుపాయాలు సిద్ధం చేసినట్లు తెలిపారు. కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామన్నారు. బుధవారం అత్యధికంగా 83 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందన్నారు.

Similar News

News August 14, 2025

సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండండి: ఎస్పీ

image

నందమూరులోని వాసవి ఇంజినీరింగ్ కళాశాలలో సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమం జరిగింది. జిల్లా ఎస్పీ ఆర్. గంగాధరరావు మాట్లాడారు. డిజిటల్, సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. వ్యక్తిగత సమాచారం, ఫేక్ లింకులు, సోషల్ మీడియా దుర్వినియోగం, డిజిటల్ అరెస్ట్ మోసాల గురించి వివరించారు.

News August 14, 2025

కృష్ణా: పెరిగిన వరద.. ఇన్‌ఛార్జ్ కలెక్టర్ ఆదేశాలు

image

ప్రకాశం బ్యారేజీ వద్ద వరద ఉద్ధృతి పెరుగుతున్న నేపథ్యంలో ముందస్తు జాగ్రత్త చర్యలు పటిష్టంగా చేపట్టాలని జిల్లా ఇన్‌చార్జ్ కలెక్టర్ గీతాంజలి శర్మ అధికారులను ఆదేశించారు. గురువారం క్షేత్రస్థాయి అధికారులతో ఆమె టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా డివిజన్ల వారీగా వరద పరిస్థితిని సమీక్షించి, అధికారులకు తగు సూచనలు, సలహాలు ఇచ్చారు. ప్రజలను అప్రమత్తం చేయాలని ఆమె ఆదేశించారు.

News August 14, 2025

మచిలీపట్నం: ఆగస్టు 15 సర్వం సిద్ధం

image

మచిలీపట్నం ఏఆర్ పోలీస్ పెరేడ్ మైదానంలో ఆగస్టు 15న జరగనున్న స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల ఏర్పాట్లు పూర్తయ్యాయి. జిల్లా ఎస్పీ ఆర్. గంగాధరరావు గురువారం పరేడ్ రిహార్సల్స్‌ను పరిశీలించారు. అతిథులు, ప్రజల కోసం ప్రత్యేక గ్యాలరీలు, వాటర్‌ప్రూఫ్ టెంట్లు ఏర్పాటు చేశామని తెలిపారు. ప్రతి ఒక్కరూ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొని జయప్రదం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.