News October 21, 2025
కృష్ణా: జోగి రమేష్ అరెస్ట్ ఆలస్యం.. అందుకేనా..?

కల్తీ మద్యం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ మంత్రి జోగి రమేశ్ అరెస్ట్ తప్పదని వార్తలు వచ్చాయి. తనను అరెస్టు చేస్తే గౌడ సామాజిక వర్గం మొత్తం రోడ్లపైకి వచ్చి నిరసన తెలియజేస్తుందని జోగి చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టించాయి. ఉమ్మడి కృష్ణా జిల్లాలో కాపుల తర్వాత గౌడ వర్గీయుల సంఖ్య అధికంగా ఉంది. అరెస్టు చేస్తే బలమైన BC సామాజిక వర్గం నుంచి వ్యతిరేకత వస్తుందేమో అని కూటమి సందేహిస్తున్నట్లు తెలుస్తుంది.
Similar News
News October 21, 2025
అరకు: 25 ఏళ్లు ఉన్నవారికి ఈ అవకాశం

అరకులోయ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అక్టోబర్ 24న ఉదయం 10 గంటలకు ప్రముఖ ఫార్మా కంపెనీల్లో ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు జరుగుతాయని ప్రిన్సిపల్ డా.నాయక్ తెలిపారు. BSc కెమిస్ట్రీ పాస్, ఫైల్, ఇంటర్, ITI(ఫిట్టర్, ఎలిక్ట్రీషన్), డిప్లమో(మెకానిక్, ఎలిక్ట్రీషన్), టెన్త్ అర్హతతో 25 ఏళ్లు ఉన్న పురుషులు అర్హులన్నారు. ఎంపికైన వారికి విశాఖ స్కిల్ సెంటర్లో ఉచిత శిక్షణతో పాటు ఉద్యోగాలు కల్పిస్తారన్నారు.
News October 21, 2025
చిత్తూరు: సెల్యూట్.. సీఐ రుషికేశవ

కొందరు పోలీసులు చనిపోయినా ప్రజల మనసులో ఎప్పుడు గుర్తుండిపోతారు. ఈ కోవకే చెందిన వారే సీఐ రుషికేశవ అలియాస్ శివమణి. విధి నిర్వహణలో క్రమశిక్షణ, నిజాయితీతో లక్షలాది మంది అభిమానులను సంపాదించుకున్నారు. 2003లో ప్రొబేషనరీ ఎస్ఐగా బాధ్యతలు చేపట్టి SI, CIగా పలమనేరు, తంబళ్లపల్లె, పెద్దపంజాణి, పుంగనూరు, PTM, గంగవరం, ములకలచెరువు, మదనపల్లెలో పనిచేశారు. 2022 జులై 8న మృతి చెందారు.
#నేడు పోలీసుల అమరవీరుల దినోత్సవం
News October 21, 2025
అన్నమయ్య: సెల్యూట్.. సీఐ రుషికేశవ

కొందరు పోలీసులు చనిపోయినా ప్రజల మనసులో ఎప్పుడు గుర్తుండిపోతారు. ఈ కోవకే చెందిన వారే సీఐ రుషికేశవ అలియాస్ శివమణి. విధి నిర్వహణలో క్రమశిక్షణ, నిజాయితీతో లక్షలాది మంది అభిమానులను సంపాదించుకున్నారు. 2003లో ప్రొబేషనరీ ఎస్ఐగా బాధ్యతలు చేపట్టి SI, CIగా పలమనేరు, తంబళ్లపల్లె, పెద్దపంజాణి, పుంగనూరు, PTM, గంగవరం, ములకలచెరువు, మదనపల్లెలో పనిచేశారు. 2022 జులై 8న మృతి చెందారు.
#నేడు పోలీసుల అమరవీరుల దినోత్సవం